Harry Brook Apology: క్షమాపణలు చెప్పిన హ్యారీ బ్రూక్.. భారీ ఫైన్ విధించి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లండ్!
- మద్యం మత్తులో హ్యారీ బ్రూక్ గొడవ
- బ్రూక్కు 30,000 పౌండ్లు జరిమానా
- బ్రూక్కు ఇంగ్లండ్ ఫైనల్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్ పర్యటన సమయంలో తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్కు ‘ఫైనల్ వార్నింగ్’ ఇచ్చి.. 30,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.36.29 లక్షలు) జరిమానాగా విధించింది. మద్యం మత్తులో ఓ నైట్క్లబ్ వద్ద గొడవకు దిగడమే ఇందుకు కారణం. 2025 నవంబర్ 1న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రూక్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. అందుకే ఈసీబీ అతడిని ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరించింది.
వెలింగ్టన్లో న్యూజిలాండ్తో జరగాల్సిన మూడో వన్డేకు ముందు హ్యారీ బ్రూక్ తన సహచర క్రికెటర్లతో కలిసి ఓ నైట్ క్లబ్కు వెళ్లాడు. మద్యం తాగి ఉన్నాడనే అనుమానంతో బ్రూక్ను బౌన్సర్లు లోపలికి అనుమతించలేదు. నైట్ క్లబ్లోకి తన ప్రవేశాన్ని నిరాకరించడంతో అక్కడి బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. బ్రూక్పై బౌన్సర్ చేయిచేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం బ్రూక్ స్వయంగా టీమ్ మేనేజ్మెంట్కు విషయం చెప్పాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన ఈసీబీ.. బ్రూక్కు రూ.36.29 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఈసీబీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బ్రూక్ తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ… ‘నా ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను. నా చర్యలు తప్పని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ ఘటన నన్ను, ఇంగ్లండ్ జట్టును కూడా ఇబ్బందికి గురిచేశాయి. ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం. ఆ బాధ్యతను నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. సహచర ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులను నిరాశపరిచినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా సరైన ప్రవర్తనతో నడుచుకుంటా. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటా’ అని చెప్పాడు.
ఈసీబీ ప్రతినిధి మాట్లాడుతూ… ‘ఈ ఘటనపై మాకు పూర్తి సమాచారం ఉంది. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాం. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. హ్యారీ బ్రూక్ క్షమాపణలు చెప్పాడు. తన ప్రవర్తన సరిగా లేదని అంగీకరించాడు’ అని తెలిపారు. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత బ్రూక్ శుక్రవారం స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ఇక జనవరి 19న శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్నాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!