భారత ఆటగాళ్లకు శుభవార్త చెప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం భారత పురుషుల జట్టు అలాగే పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న భారత జట్టు కోసం క్వారంటైన్ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత 10 రోజుల క్వారంటైన్ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం టీమిండియాకు చెందిన పురుషులు, మహిళల జట్లు ముంబైలో క్వారంటైన్లో ఉన్నాయి. ఇక ఈ పర్యటన కోసం జూన్ 2న భారత మహిళల, పురుషుల జట్లు ఒకే ఛార్టర్ విమానంలో బ్రిటన్కు వెళ్లనున్నాయి.