DPL Players Fight: డీపీఎల్లో ఉద్రిక్తత.. స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..!
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఉద్రిక్తత..
- సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ ప్లేయర్స్ మధ్య గొడవ..
- స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DPL Players Fight: అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ఎక్కువ దూకుడుగా కనిపిస్తుంటారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ మాత్రం అగ్రెసివ్ గా ఉండటం సహజమే. ఇక, లీగ్ల విషయాని వస్తే.. ఇక్కడ మొత్తం కమర్షియల్.. గెలుపు కోసం చూస్తారే తప్పా గొడవలకు దిగడం చాలా తక్కువ.. కానీ, దేశవాళీ క్రికెట్లో ఇటీవల ప్లేయర్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా, ఢిల్లీ ప్రీమియర్ లీగ్లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకానొక దశలో ఆటగాళ్లు కొట్టుకొనే వరకూ వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Read Also: Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
అయితే, డీపీఎల్ 2025 నాకౌట్ దశకు చేరుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కొనసాగింది.. మొదట సౌత్ ఢిల్లీ బ్యాటింగ్కు వచ్చి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన వెస్ట్ ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక, ఓపెనర్ క్రిష్ యాదవ్ (31), మయాంక్ గుసైన్ (15*)తో కలిసి నితీశ్ (134*: 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్లు)తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచారు. క్రిష్ – నితీశ్ కలిసి 3 వికెట్కు 98 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.
Read Also: Cloudburst: జమ్మూకాశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
ఇక, నితీశ్ – క్రిష్ జోడీ మరింత దూకుడుగా ఆడుతున్న సమయంలో సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలికి క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అన్మోల్ శర్మ చేతికి చిక్కాడు. అప్పుడే బౌలర్ – బ్యాటర్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.. ఒకరినొకరు తొసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వారిని సహచర ఆటగాళ్ల ఆపేందుకు ప్రయత్నించారు. కీలక వికెట్ పడటంతో సౌత్ ఢిల్లీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో.. డగౌట్కు వెళ్తున్న క్రిష్ యాదవ్ ఏవో కామెంట్స్ చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కొట్టుకోవడంతో అంపైర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
DPL eliminator match🔥🔥🌋🌋#DPLT20 pic.twitter.com/0ag54kzNrP
— Aaditya jha (@aadi___45) August 29, 2025
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!