DPL Players Fight: డీపీఎల్లో ఉద్రిక్తత.. స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..!
- ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఉద్రిక్తత..
- సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ ప్లేయర్స్ మధ్య గొడవ..
- స్టేడియంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DPL Players Fight: అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు ఎక్కువ దూకుడుగా కనిపిస్తుంటారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ మాత్రం అగ్రెసివ్ గా ఉండటం సహజమే. ఇక, లీగ్ల విషయాని వస్తే.. ఇక్కడ మొత్తం కమర్షియల్.. గెలుపు కోసం చూస్తారే తప్పా గొడవలకు దిగడం చాలా తక్కువ.. కానీ, దేశవాళీ క్రికెట్లో ఇటీవల ప్లేయర్స్ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా, ఢిల్లీ ప్రీమియర్ లీగ్లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒకానొక దశలో ఆటగాళ్లు కొట్టుకొనే వరకూ వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Read Also: Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!
Also Read
- Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, డీపీఎల్ 2025 నాకౌట్ దశకు చేరుకుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కొనసాగింది.. మొదట సౌత్ ఢిల్లీ బ్యాటింగ్కు వచ్చి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన వెస్ట్ ఢిల్లీకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. స్వల్ప స్కోర్ వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఇక, ఓపెనర్ క్రిష్ యాదవ్ (31), మయాంక్ గుసైన్ (15*)తో కలిసి నితీశ్ (134*: 55 బంతుల్లో 8 ఫోర్లు, 15 సిక్స్లు)తో తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచారు. క్రిష్ – నితీశ్ కలిసి 3 వికెట్కు 98 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు.
Read Also: Cloudburst: జమ్మూకాశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి.. పలువురు గల్లంతు
ఇక, నితీశ్ – క్రిష్ జోడీ మరింత దూకుడుగా ఆడుతున్న సమయంలో సౌత్ ఢిల్లీ బౌలర్ భార్తి ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలికి క్రిష్ యాదవ్ భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అన్మోల్ శర్మ చేతికి చిక్కాడు. అప్పుడే బౌలర్ – బ్యాటర్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది.. ఒకరినొకరు తొసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. వారిని సహచర ఆటగాళ్ల ఆపేందుకు ప్రయత్నించారు. కీలక వికెట్ పడటంతో సౌత్ ఢిల్లీ ప్లేయర్లు సెలబ్రేషన్స్ చేసుకోవడంతో.. డగౌట్కు వెళ్తున్న క్రిష్ యాదవ్ ఏవో కామెంట్స్ చేయడంతో మళ్లీ ఒక్కసారిగా కొట్టుకోవడంతో అంపైర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఇక, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
DPL eliminator match🔥🔥🌋🌋#DPLT20 pic.twitter.com/0ag54kzNrP
— Aaditya jha (@aadi___45) August 29, 2025
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..