IND vs PAK Tickets Price: భారత్-పాక్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే..?
- భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధం..
- ఈ హై వోల్టేజ్ మ్యాచ్ టిక్కెట్ ధర ఏకంగా రూ. 15. 75 లక్షలు..
- ఇంకా టిక్కెట్లు విడుదల చేయలేదని ప్రకటించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Tickets Price: భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఆసియాకప్- 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన చిరకాల ప్రత్యర్థులు తాడోపేడో తెల్చుకోనున్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియానికి వెళ్లి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో భారత్- పాక్ మ్యాచ్ క్రేజుని బ్లాక్ మార్కెట్లు సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాయాదుల పోరుకు సంబంధించి బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రూ.15.75 లక్షలు పలికినట్లు సమాచారం.
Read Also: Dowry Harassment: పెళ్లై మూడేళ్లే.. ఆ కారణంతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, ఇండియా- పాక్ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో టిక్కెట్లు విక్రయించే అవకాశం ఉంది. కానీ, కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం కచ్చితంగా టిక్కెట్లు ఇస్తామని ఫ్యాన్స్ నుంచి అందినకాడికి దోచేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం రియాక్ట్ అయింది..
Read Also: Kohli vs MS Dhoni: విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.. ధోనీ మాత్రం పట్టించుకోలేదు..!
ఇక, ఆసియాకప్ టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు.. రెండు రోజుల్లో అమ్మకం స్టార్ట్ చేస్తాం.. ఫ్యాన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేసుకోండి.. థర్డ్ పార్టీ వెబ్సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆసియాకప్లో భారత్-పాక్ జట్లు 3 సార్లు పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లే ఫైనల్కి వెళితే సెప్టెంబర్ 28న మరోసారి భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్లో పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కిరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
🎟️ ATTENTION FANS 🎟️
An important update regarding tickets for the DP World Asia Cup 2025.
#ACC pic.twitter.com/CYe4k0fRFi— AsianCricketCouncil (@ACCMedia1) August 19, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!