IND vs PAK Tickets Price: భారత్-పాక్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే..?
- భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధం..
- ఈ హై వోల్టేజ్ మ్యాచ్ టిక్కెట్ ధర ఏకంగా రూ. 15. 75 లక్షలు..
- ఇంకా టిక్కెట్లు విడుదల చేయలేదని ప్రకటించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Tickets Price: భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఆసియాకప్- 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన చిరకాల ప్రత్యర్థులు తాడోపేడో తెల్చుకోనున్నారు. ఈ దాయుదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను చాలా మంది ఫ్యాన్స్ నేరుగా స్టేడియానికి వెళ్లి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో భారత్- పాక్ మ్యాచ్ క్రేజుని బ్లాక్ మార్కెట్లు సొమ్ము చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దాయాదుల పోరుకు సంబంధించి బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రూ.15.75 లక్షలు పలికినట్లు సమాచారం.
Read Also: Dowry Harassment: పెళ్లై మూడేళ్లే.. ఆ కారణంతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
- IND vs PAK: అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు.. పాపం భారత్ డామినేషన్ను తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..
అయితే, ఇండియా- పాక్ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో టిక్కెట్లు విక్రయించే అవకాశం ఉంది. కానీ, కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్లు మాత్రం కచ్చితంగా టిక్కెట్లు ఇస్తామని ఫ్యాన్స్ నుంచి అందినకాడికి దోచేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఇదే విషయంపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం రియాక్ట్ అయింది..
Read Also: Kohli vs MS Dhoni: విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.. ధోనీ మాత్రం పట్టించుకోలేదు..!
ఇక, ఆసియాకప్ టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు.. రెండు రోజుల్లో అమ్మకం స్టార్ట్ చేస్తాం.. ఫ్యాన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేసుకోండి.. థర్డ్ పార్టీ వెబ్సైట్లలో టికెట్లను కొని మోసపోవద్దని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆసియాకప్లో భారత్-పాక్ జట్లు 3 సార్లు పోటీ పడనున్నాయి. ఈ రెండు జట్లే ఫైనల్కి వెళితే సెప్టెంబర్ 28న మరోసారి భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మరోవైపు పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్లో పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కిరించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
🎟️ ATTENTION FANS 🎟️
An important update regarding tickets for the DP World Asia Cup 2025.
#ACC pic.twitter.com/CYe4k0fRFi— AsianCricketCouncil (@ACCMedia1) August 19, 2025
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!