నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కేంద్రం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్, భద్రత, షేరింగ్ అంశాలు, వినియోగదారుల భద్రతకు సంబంధించిన షేరింగ్ అంశాలను కేంద్రం పరిశీలించనుంది.
చైనా కంపెనీలు భారతీయ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ వివరాలు, ఆధార్ కార్డు, లొకేషన్ వంటివి షేర్ చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ పౌరుల భద్రత కోసం కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్.. వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లో 50 శాతం పైగా స్థానాన్ని ఆక్రమించాయి. మిగతా ఫోన్ల కంటే ఇవి కాస్త తక్కువ ధరకు లభిస్తున్నాయి.
Also Read
- Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
- Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
- Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
దీంతో వినియోగదారులు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. ఈమధ్య కాలంలో లోన్ యాప్లు ఎంత అరాచకానికి కారణం అయ్యాయో అందరికీ తెలిసిందే. లోన్ ఇవ్వడం, వారి వ్యక్తిగత వివరాలు, ఫ్రెండ్స్ వివరాలు కూడా సేకరించి… ఈఎంఐ ఆలస్యం అయితే వారిని వేధించడం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్రం వినియోగదారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.
గత ఏడాది లడఖ్ లో గాల్వాన్ ఘటన తరువాత, భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశ భద్రత దృష్యా భారత ప్రభుత్వం పలు చైనా యాప్ లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020లో మోడీ ప్రభుత్వం మొత్తం 220 చైనా యాప్ లను బ్యాన్ చేసింది.
ఇండియా భద్రతా ప్రమాణాలకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని చెప్పి.. చైనాకు చెందిన 59 యాప్ లను 2020 జూన్ 29 న బ్యాన్ చేశారు. అందులో హలో, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, కామ్ స్కానర్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత సెప్టెంబర్ 5 వ తేదీన 118 యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో పబ్జీ, పబ్జీ లైట్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత నవంబర్ 24న మరో 43 చైనా యాప్ లపై నిషేధం విధించింది. గత ఏడాది 220 చైనా యాప్స్ పై కేంద్రం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
- Tags
- china
- Chinese Apps
- OnePlus
- Oppo
- Security
తాజావార్తలు
-
Samantha : సమంత ‘మా ఇంటి బంగారం’కు పోటీగా దిగుతోన్న నాలుగైదు సినిమాలు
-
OnePlus N6: వన్ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
-
Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
-
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
-
Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!