Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..
- విదేశీ ట్రిప్ కోసం లక్షలు అవసరం లేదు
- బడ్జెట్ ధరలో ఈ దేశాలు తిరిగి రండి
- వారెవ్వా అనిపించే టూర్ వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget International Trips: సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే మనకు యూరప్ లేదా అమెరికా వంటి ఖరీదైన దేశాలే గుర్తొస్తాయి. కానీ మన పొరుగు దేశాల్లోనే ప్రపంచస్థాయి అందాలు కొలువుదీరాయని మీకు తెలుసా. నేపాల్లోని మంచు శిఖరాలు, భూటాన్లోని ప్రశాంతత, శ్రీలంకలోని నీలి సముద్ర తీరాలు.. ఏ దేశానికైనా పోటీనివ్వగలవు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ పొరుగు దేశాలు సరైన ఎంపిక అని చెబుతున్నారు. వాటి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్బడ్.. స్పందించిన కంపెనీ..
Also Read
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
- Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
నేపాల్: హిమాలయాల ఒడిలో..
భారతీయులకు అత్యంత పొరుగు దేశం నేపాల్. ఇక్కడికి ఫ్లైట్లోనే కాకుండా బస్సులో కూడా వెళ్లవచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడే ఉంది. ప్రకృతి ప్రేమికులకు కాట్మండు, పోఖ్రా, లుంబినీ ప్రాంతాలు అద్భుతమైన అనుభూతినిస్తాయి. నిజానికి ఈ దేశానికి వెళ్లాలంటే భారతీయులకు వీసా అవసరం లేదు. కేవలం ఓటర్ ఐడి కార్డుతో కూడా నేపాల్ వెళ్లవచ్చు.
భూటాన్: ప్రకృతి ఒడిలో ప్రశాంతత
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో భూటాన్ ఒకటి. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వెళ్తే ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. తూర్పు హిమాలయ పర్వతాలు, పచ్చని అడవులు, సాంప్రదాయ ఇళ్లు ఇక్కడి ప్రత్యేకత. పారో, థింపూ, పునాఖా ఇక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఈ దేశానికి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నప్పటికీ, ఎంట్రీ పర్మిట్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీజు’ (SDF) చెల్లించాల్సి ఉంటుంది.
మయన్మార్: సంస్కృతుల సమ్మేళనం
భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరంలకు ఆనుకుని ఉండే మయన్మార్, ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. యాంగూన్, బగాన్, ఇన్లే లేక్ వంటి ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడికి ఫ్లైట్ లేదా బస్సులో వెళ్లే సౌకర్యం కూడా ఉంది. భారతీయులు ఇ – వీసా (e-Visa) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీలంక: నీలి సముద్ర తీరం
దక్షిణ భారతానికి అతి సమీపంలో ఉండే ద్వీప దేశం శ్రీలంక. రామేశ్వరం నుంచి మన్నార్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తే సముద్ర జీవుల వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. విమానాలతో పాటు దక్షిణ భారతం నుంచి క్రూయిజ్ షిప్ల ద్వారా కూడా ఇక్కడికి వెళ్లవచ్చు. సిగిరియా, క్యాండీ, నువారా ఎలియా ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ఈ దేశానికి వెళ్లడానికి భారతీయులకు ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) అవసరం. తరచుగా శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు ఉచిత వీసా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం కల్పిస్తుంటుంది. ప్రయాణానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తక్కువ రోజుల్లో విదేశీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ నాలుగు దేశాలు బెస్ట్ ఆప్షన్స్గా నిలుస్తున్నాయి.
READ ALSO: X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..