Budget International Trips: తక్కువ బడ్జెట్.. ఫుల్ ఎంజాయ్మెంట్! కేవలం మన ఊరు వెళ్లే ఖర్చుతోనే విదేశాలకు వెళ్లొచ్చు..
- విదేశీ ట్రిప్ కోసం లక్షలు అవసరం లేదు
- బడ్జెట్ ధరలో ఈ దేశాలు తిరిగి రండి
- వారెవ్వా అనిపించే టూర్ వివరాలు ఇవే..
Budget International Trips: సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే మనకు యూరప్ లేదా అమెరికా వంటి ఖరీదైన దేశాలే గుర్తొస్తాయి. కానీ మన పొరుగు దేశాల్లోనే ప్రపంచస్థాయి అందాలు కొలువుదీరాయని మీకు తెలుసా. నేపాల్లోని మంచు శిఖరాలు, భూటాన్లోని ప్రశాంతత, శ్రీలంకలోని నీలి సముద్ర తీరాలు.. ఏ దేశానికైనా పోటీనివ్వగలవు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి ఈ పొరుగు దేశాలు సరైన ఎంపిక అని చెబుతున్నారు. వాటి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Earbud Burst: స్టూడెంట్ చెవిలో పేలిన జేబీఎల్ ఇయర్బడ్.. స్పందించిన కంపెనీ..
Also Read
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
- Kedarnath: కేదార్నాథ్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
- Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
నేపాల్: హిమాలయాల ఒడిలో..
భారతీయులకు అత్యంత పొరుగు దేశం నేపాల్. ఇక్కడికి ఫ్లైట్లోనే కాకుండా బస్సులో కూడా వెళ్లవచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడే ఉంది. ప్రకృతి ప్రేమికులకు కాట్మండు, పోఖ్రా, లుంబినీ ప్రాంతాలు అద్భుతమైన అనుభూతినిస్తాయి. నిజానికి ఈ దేశానికి వెళ్లాలంటే భారతీయులకు వీసా అవసరం లేదు. కేవలం ఓటర్ ఐడి కార్డుతో కూడా నేపాల్ వెళ్లవచ్చు.
భూటాన్: ప్రకృతి ఒడిలో ప్రశాంతత
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో భూటాన్ ఒకటి. రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వెళ్తే ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. తూర్పు హిమాలయ పర్వతాలు, పచ్చని అడవులు, సాంప్రదాయ ఇళ్లు ఇక్కడి ప్రత్యేకత. పారో, థింపూ, పునాఖా ఇక్కడ తప్పక చూడాల్సిన ప్రదేశాలు. ఈ దేశానికి భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్నప్పటికీ, ఎంట్రీ పర్మిట్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీజు’ (SDF) చెల్లించాల్సి ఉంటుంది.
మయన్మార్: సంస్కృతుల సమ్మేళనం
భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరంలకు ఆనుకుని ఉండే మయన్మార్, ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. యాంగూన్, బగాన్, ఇన్లే లేక్ వంటి ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడికి ఫ్లైట్ లేదా బస్సులో వెళ్లే సౌకర్యం కూడా ఉంది. భారతీయులు ఇ – వీసా (e-Visa) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీలంక: నీలి సముద్ర తీరం
దక్షిణ భారతానికి అతి సమీపంలో ఉండే ద్వీప దేశం శ్రీలంక. రామేశ్వరం నుంచి మన్నార్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తే సముద్ర జీవుల వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. విమానాలతో పాటు దక్షిణ భారతం నుంచి క్రూయిజ్ షిప్ల ద్వారా కూడా ఇక్కడికి వెళ్లవచ్చు. సిగిరియా, క్యాండీ, నువారా ఎలియా ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ఈ దేశానికి వెళ్లడానికి భారతీయులకు ETA (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) అవసరం. తరచుగా శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు ఉచిత వీసా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యం కల్పిస్తుంటుంది. ప్రయాణానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ ఖర్చు పెట్టకుండా, తక్కువ రోజుల్లో విదేశీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఈ నాలుగు దేశాలు బెస్ట్ ఆప్షన్స్గా నిలుస్తున్నాయి.
READ ALSO: X Monetization: సంచలన నిర్ణయం తీసుకున్న ఎక్స్.. ఒరిజినల్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్! కానీ..
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!