Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Minister Vellampalli Over Acb Raids On Vijayawada Durga Temple

మంత్రి వెల్లంపల్లికి నిద్రలేకుండా చేస్తున్న దుర్గగుడిలో ఏసీబీ సోదాలు..!

Published Date :February 25, 2021 , 12:26 pm
By newsdesk
మంత్రి వెల్లంపల్లికి నిద్రలేకుండా చేస్తున్న దుర్గగుడిలో ఏసీబీ సోదాలు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్‌  ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు? 

ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం!

దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్‌ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ టెన్షన్‌ పడుతున్నారట. ఆయన మంత్రిత్వశాఖ పరిధిలోకే కాదు..  ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గ పరిధిలోకి కూడా దుర్గమ్మ ఆలయం వస్తుంది. ఏసీబీ ఎంట్రీ ఒక సంచలనమైతే.. ఏసీబీ సిఫారసుల మేరకు దుర్గగుడిలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయడం ఇంకా కలకలం రేపుతోంది. ఈ చర్యలు.. జరుగుతున్న పరిణామాలతో మంత్రిగారి శిబిరంలో నిద్ర కరువైందని సమాచారం. 

దుర్గ గుడిలో ఏం జరగాలన్నా మంత్రి అనుచరుల అనుమతి కావాలా? 

మొత్తం చర్చంతా మంత్రి వెల్లంపల్లి చుట్టూనే తిరుగుతోందట. ఈ ప్రచారంలో పనిలో పనిగా 2009 నాటి పరిణామాలను ప్రస్తావిస్తున్నారట కొందరు. వెల్లంపల్లి 2009లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా ఆయన అనుచరుల హవా దుర్గగుడిలో కొనసాగిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు వెల్లంపల్లి మంత్రి అయ్యారు. దేవాదాయశాఖను చేపట్టారు. దీంతో ఆయన వర్గం ఇంద్రకీలాద్రిపై స్పీడ్‌ పెంచిందని టాక్‌. మంత్రిగారి అనుచరుల అనుమతి లేనిదే కొండపై ఏ పనీ జరగబోదని కథలు కథలుగా చెప్పుకొంటారట. 

రాజకీయ కారణాలతో విమర్శలు చేస్తున్నారని మంత్రి కౌంటర్‌!

అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలు చోరీ అయినప్పుడు అన్ని పక్షాలకు మంత్రి వెల్లంపల్లి టార్గెట్‌ అయ్యారు. అంతకుముందు ఈవో సురేష్‌ నియామకం సమయంలోనూ విమర్శలు రేగాయి. కోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఇటీవల కొండరాళ్లు జారిపడటం, సెక్యూరిటీ టెండర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు, శానిటేషన్ టెండర్లు, దసరా ఉత్సవాల నిర్వహణ సహా వివిధ అంశాలు వివాదాస్పదం అయ్యాయి. దుర్గగుడిలో అంతర్గత బదిలీలలోనూ పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆలయానికి సంబంధించిన ఎలాంటి విమర్శలు.. ఆరోపణలు వచ్చినా.. వాటిని రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేసేవారు మంత్రి. 

ఇరకాటంలో పెడుతున్నారా? గిట్టని వారు చేస్తున్న పనా?

ఇప్పుడు ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో వైరిపక్షాలు సైతం యాక్టివ్‌ అయ్యాయి. జనసేన నేత పోతిన మహేష్‌ తన దగ్గరున్న వివరాలను ఆయన ఏసీబీకి అందజేయడంతో ఇదేం గొడవ అని మంత్రిగారి శిబిరం చికాకు పడుతోందట. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి నుంచి ఏసీబీ వివరాలు సేకరించడాన్ని తనను ఇరకాటంలో నెట్టడంగా భావిస్తున్నారట వెల్లంపల్లి. వైసీపీలో తానంటే గట్టినవారు ఎవరైనా వీటిని ప్రోత్సహిస్తున్నారా అని ఆరా తీస్తున్నారట. 

ఏసీబీ సోదాల వెనక వేరే కారణాలున్నాయా? 

ఏసీబీ సిఫారసుతో  ఉద్యోగులపై  వేటు పడిన ఈ వ్యవహారం ఇక్కడితో ముగుస్తుందా లేక మూలాల వరకు వెళ్తుందా అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన జమ్మిదొడ్డి కార్యాలయంలోనే మంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. అందుకే దుర్గగుడిలో అక్రమాలు టార్గెట్‌గా ఏసీబీ సోదాలు జరిగాయా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్నది మంత్రి శిబిరానికి అర్థం కావడం లేదట. మరి.. ఈ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Durga Temple
  • vellampalli srinivas rao
  • vijayawada

తాజావార్తలు

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions