Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA రాజాసింగ్పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా? వేటు వేస్తారా? MIM ఇచ్చిన ఫిర్యాదుపై సభాపతి ఏం చేస్తారు? గతంలో శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయా? స్పీకర్ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? లెట్స్ వాచ్..!
వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ MLA రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయనపై PD యాక్ట్ కింద చర్యలు తీసుకున్నారు పోలీసులు. అయితే రాజాసింగ్పై మరిన్ని చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. రాజాసింగ్పై MIM స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అందుకే అందరి దృష్టీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలనేది MIM డిమాండ్. స్పీకర్కు అందజేసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ మధుసుదనా చారి బహిష్కరణ వేటు వేశారు. అసెంబ్లీ జాయింట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లు అనుచితంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకున్నారు సభాపతి. ఆ తర్వాత ఆ ఇద్దరూ స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇంతలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నిక రాలేదు.
తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై బహిష్కరణ వేటుకు ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం ఏం చేస్తారన్నది చర్చగా మారుతోంది. సభాపతి ఏం చేస్తారు? వేటు వేయడానికే సిద్ధపడితే తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పై వేటు వేస్తే గోషామహల్కు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక వేడి ఉండటంతో.. గోషామహల్లోనూ బైఎలక్షన్కు అధికారపార్టీ సిద్ధ పడుతుందా అనేది ఒక వాదన.
మొత్తంగా ఎంఐఎం లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయల్లో చర్చగా మారింది. ఆ లేఖపై సభాపతి న్యాయనిపుణల సలహా తీసుకుని.. ఒక నిర్ణయానికి వస్తారని అనుకుంటున్నారు. అయితే పీడీ యాక్ట్పై అరెస్ట్ చేయడాన్ని న్యాయపరంగా సవాల్ చేసే పనిలో రాజాసింగ్ ఉన్నారు. దానిపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా? లేక ముందుగానే ప్రక్రియ ప్రారంభించి నిర్ణయం ప్రకటిస్తారా అనేది కూడా చర్చే. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!