TRS : తెలంగాణలో ఆ మంత్రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనట్టేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చామకూర మల్లారెడ్డి. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారే గెలిచినా.. ఆయనకు కేబినెట్లో చోటుకల్పించారు సీఎం కేసీఆర్. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ను తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి ఇప్పించుకున్నారు మల్లారెడ్డి. కానీ.. రేవంత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. అల్లుడి ఓటమి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపించిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. దానికితోడు కార్మికశాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు బాగోలేదనే రిపోర్ట్స్ వెళ్లాయట. సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్లో నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలను మల్లారెడ్డే ప్రోత్సహిస్తున్నట్టు కేడర్ ఆరోపిస్తోంది.
ఈ పరిణామాల మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి మల్లారెడ్డి పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా మంచి పదవులే అనుభవించేశాననే ఫీలింగ్లో ఉన్నారట. ఇకపై రాజకీయాల్లో ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. క్రియాశీలక పాలిటిక్స్కు దూరంగా ఉంటానని కుటుంబ సభ్యులతో మల్లారెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే ఉన్న ఫలంగా యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనక ఇంకో కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read
మల్లారెడ్డి విద్యాసంస్థలకు ఆయన కుమారుడు భద్రారెడ్డి, మహేందర్రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కోడళ్లతోపాటు ఇతర వ్యవహారాల్లో కుమార్తె, అల్లుడు కొనసాగుతున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండగానే ఆయనకు ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరిక నెరవేరిందని.. దీంతో ఇక ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొస్తున్నారట. అయితే ఎమ్మెల్యే టికెట్పై కుటుంబ సభ్యుల నుంచే ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. కుమారులు, కోడళ్లు, కుమార్తెతోపాటు అల్లుడు కూడా క్రియాశీలక రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఎంపీగా పోటీ చేసి ఓడిన అల్లుడు రాజశేఖర్రెడ్డి మళ్లీ మల్కాజ్గిరి లోక్సభకు బరిలో ఉంటారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేదు. గత ఎన్నికల్లోనే ఖర్చు తడిసి మోపెడు అయ్యిందని.. మరోసారి అంతటి భారాన్ని మోయలేనని అనుచరులతో రాజశేఖర్రెడ్డి చెప్పినట్టు సమాచారం. మామ మల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ తాను తీసుకుని పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చనే లెక్కల్లో ఉన్నారట అల్లుడు.
మల్లారెడ్డి నిర్ణయంపై ప్రస్తుతం కుటుంబంలోనూ.. పార్టీ కేడర్లోనూ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పెద్దల వరకు వెళ్లలేదట. దీంతో తనకు కాకుండా కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారని మంత్రి చెబితే సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న. మంత్రి మాత్రం.. ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విద్యా సంస్థల నిర్వహణ చూసుకుంటూ.. వ్యాపారాలపై ఫోకస్ పెట్టి కాలం వెళ్లదీయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి.. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి ఏ అంశానికి కట్టుబడి ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!