టీడీపీలో త్యాగాల పేరిట కీలక నాయకుల సీటుకే ఎసరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పార్టీలలో హడావిడి మొదలైంది. సీట్ల మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ తరహా చర్చలు టీడీపీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకించి సీనియర్లలో చాలా టెన్షన్ కనిపిస్తోందట. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు పొందిన నాయకుల సీటుకే ప్రస్తుతం ఎసరు వచ్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగానే అధినేత చంద్రబాబు కామెంట్స్ ఉంటున్నాయట.
ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. చంద్రబాబుతోపాటు.. నారా లోకేష్తోనూ సమావేశం అయ్యారట. ఆ సందర్భంగా జరిగిన చర్చ నేతలకు నిద్రను దూరం చేసిందట. మీరు పార్టీలో చాలా సీనియర్ లీడర్లు. చాలా పదవులే చూశారు. మారిన రాజకీయ పరిస్థితులు.. స్థానికంగా ఉన్న సమీకరణాల వల్ల త్యాగాలు చేయాల్సి రావొచ్చని ముఖం మీదే చెప్పేశారట. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కొద్దిరోజులుగా ఆయన సైలెంట్గా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత పెద్దగా జనాల్లో కనిపించింది లేదు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నారట కిష్టప్ప. పనిలో పనిగా.. తన కుమారుడికి కూడా ఛాన్స్ ఇప్పించాలనే ఆశతో కిష్టప్ప ఉన్నారు. ఇదే అజెండాతో చంద్రబాబును కలిసి మాట్లాడిన సమయంలో.. ఆయన పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కిష్టప్పకు సూచించారట. ఇక త్యాగాలు చేయాల్సిన టైం వచ్చిందని లోకేష్ చెప్పడంతో కిష్టప్పకు ఫీజులు ఎగిరిపోయాయట. అలా అన్న లోకేష్కి ఏం చెప్పాలో తెలియక దిగులు చెందారట. కిష్టప్పకు సూటిగా సమాధానం వచ్చినప్పటీకీ మిగిలిన నేతలు విషయంలో వచ్చిన సమాధానం మరోలా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
నిమ్మల కిష్టప్పకు తగిలిన షాక్తో అలర్ట్ అయిన సత్యసాయి జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలు చంద్రబాబును కలిసి టికెట్పై క్లారిటీ తీసుకుందామని అనుకున్నారట. అధినేత మాత్రం ముందు పార్టీ కోసం పని చేయండి.. జనంలోకి వెళ్లాలని సూచించారట. ఆ తర్వాత లోకేష్ దగ్గరకు వెళ్లగానే కిష్టప్పకు చెప్పినట్టే వారికీ బదులిచ్చారట. త్యాగాలు చేయాలి అని లోకేష్ అనగానే ఆ నేతల నోట మాట లేక వెళ్లినదారిలోనే వెనక్కు వచ్చేశారట. తమలాంటి సీనియర్లకు ఏ ఇబ్బందులు లేకుండా సీట్ చేతిలో పెడతారని అనుకుంటుంటే.. ముందు పని చేయండి తర్వాత చూద్దాం అనే ధోరణిలో అధినేతల నుంచి సమాధానం రావడం వారు ఊహించలేదట. మరోవైపు బాస్లు ఏం చెప్పారో.. తమకూ చెప్పాలని కేడర్ అడుగుతుంటే బదులివ్వలేక సతమతం చెందుతున్నారట ఆ నాయకులు.
మొత్తానికి టీడీపీ నేతలు తీవ్ర నిరుత్సాహంలో పడ్డారు. టికెట్ రాదని కానీ.. ఇస్తామని కానీ చెప్పకుండా గందరగోళంలో పెట్టారట చంద్రబాబు, లోకేష్. త్యాగాలు అనే పదంతో మాత్రం పరోక్షంగా రాబోయే రోజుల్లో జరగబోయేది చెప్పారని పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
తాజావార్తలు
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Bandla Ganesh: ‘టెంపర్’ సినిమా ఇప్పుడు తీస్తే రూ.1000 కోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత బండ్ల గణేష్
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?