Munugodu Politics : కోమటిరెడ్డి బీజేపీలో చేరితే త్యాగాలకు సిద్దమవుతున్న నేత ఎవరు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugodu Politics : ఊరందరిదీ ఒకదారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉందట మునుగోడు బీజేపీ నేతల తీరు. తెలంగాణ రాజకీయాలను మునుగోడు హీటెక్కిస్తుంటే.. అక్కడి బీజేపీ నేతలు మాత్రం డైలమాలో పడ్డారట. కొత్త లెక్కలు వేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మునుగొడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉండటంతో స్థానిక కమలనాథులు తమ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారట. పార్టీలోకి కొత్తగా ఎవరు వచ్చినా వారితోపాటు కొందరు నేతలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు రాజగోపాల్రెడ్డితోపాటు వచ్చేవారిని తలచుకుని తమ పరిస్థితి ఏంటా అని బీజేపీ కేడర్ టెన్షన్ పడుతోందట. రానున్న రోజుల్లో తమకు పదవులు.. ప్రాధాన్యం దక్కుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
Also Read
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన గంగిడి మనోహార్ రెడ్డి దారెటు అనేది ప్రస్తుతం ప్రశ్న. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మునుగోడు బీజేపీ ఇంఛార్జ్ కూడా. రాజగోపాల్రెడ్డి వచ్చాక మనోహర్రెడ్డికి దక్కే ప్రాధాన్యంపై చర్చ జరుగుతోంది. రెండు ఎన్నికల్లో ఓడినా.. మునుగోడులో బీజేపీ కేడర్కు అండగా ఉండి.. పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు చేపట్టారనేది కమలనాధుల వాదన. వాస్తవానికి గత రెండు ఎన్నికల్లోనూ మునుగోడులో బీజేపీ పెద్దగా ప్రభావం చూపింది లేదు. 2014లో బీజేపీకి మునుగోడులో 27 వేల ఓట్లు వస్తే.. 2018లో 12 వేల ఓట్లే వచ్చాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 తర్వాత జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ బీజేపీ చతికిల పడింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గట్టిగా ప్రచారం జరిగినా.. బీజేపీ తేలిపోయింది. ఇప్పుడు మునుగోడు వంతు రావడంతో అందరి దృష్టీ ఇటు మళ్లింది. కాకపోతే స్థానిక నేతలు.. కేడర్ పరిస్థితి ఏంటి? రాజగోపాల్రెడ్డి వచ్చాక పార్టీ బలపడుతుందా? కొత్త మార్పులు చోటు చేసుకుంటాయా అనేది పెద్ద చర్చ. వాస్తవానికి కొత్త నీరు వస్తే.. పాత నీరు పోవాల్సిందే. రానున్న రోజుల్లో అదే జరుగుతుందని కేడర్ ఆందోళన చెందుతుందట. తాజా ఎపిసోడ్లో బయట పడకపోయినా.. మనోహర్రెడ్డి మాత్రం బీజేపీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎపిసోడ్ను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తుండటంతో.. పార్టీ కేడర్కు.. నేతలకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండబోదని సమాధాన పడుతున్నారట.
రాజగోపాల్రెడ్డి చేరికపై స్పష్టత వచ్చాక.. మునుగోడు బీజేపీ నేతలతో అధిష్ఠానం చర్చలు జరుపుతుందని ఆశిస్తున్నారట. బీజేపీ అధికారంలోకి రావాలంటే త్యాగాలకు సిద్ధం కావాలని.. అయితే అది ఏ స్థాయిలో అనేది స్పష్టత లేదట. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పిలిచి మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నారట. మొత్తానికి మునుగోడు బీజేపీలో రాజకీయ వేడిపై ఎవరిగోల వారిదే అన్నట్టుగా మారిపోయింది.
తాజావార్తలు
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!