TPCC Leaders Unity:ఆ నలుగురూ కలిశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జాతీయ పార్టీలో ఆ నలుగురు కీలకం. రాజకీయం అంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది. కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కానీ.. ఎవరిదారి వాళ్లదే. కలిసి పనిచేస్తే చూడాలన్నది కేడర్ ఆశ. మారిన పరిస్థితుల్లో ఆ నలుగురు కలిశారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ మనసులు కలిశాయా? మాటలే కలిశాయా? ఎవరా నాయకులు?
నలుగురు కాంగ్రెస్ నేతలు ఒకే తాటిమీదకు వస్తున్నారా?
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్లో కీలక నాయకులు. కొన్నాళ్లుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఈ మధ్యే కలిసే ప్రయత్నం మొదలుపెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ నలుగురు ఒకే తాటిమీదకు వచ్చేస్తారని ఎవరికి వారు లెక్క లేసుకుంటున్నారు.
Also Read
రేవంత్, కోమటిరెడ్డి కలిసిపోయారా?
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉండేది. తాజాగా ఇద్దరు నాయకులు భేటీ అయ్యి చాలా విషయాలు మాట్లాడేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి మరీ గంటన్నరపాటు చర్చలు జరిపారు రేవంత్. ఆ తర్వాత రేవంత్కిగానీ.. పార్టీకికానీ వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడింది లేదు. పైగా సింగరేణిలో అక్రమాలపై విచారణ జరపాలని ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తున్నారు. అయితే వెంకటరెడ్డి ఇలాగే ఉంటారా? లేక మళ్లీ మాట జారతారా అనే టెన్షన్ పార్టీ వర్గాల్లో లేకపోలేదు.
ఉత్తమ్, రేవంత్ బాహాటంగా విమర్శలు చేసుకోరు
ఇక రేవంత్, ఉత్తమ్లు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టే కనిపిస్తారు. కానీ.. ఇద్దరి రాజకీయ వ్యూహాలు వేరు. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విషయంలో ఉత్తమ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డికి నచ్చ జెప్పే పనిలో ఉన్నారు కూడా. కొన్ని అంశాలపై ఇద్దరూ మాట్లాడుకుంటారు కానీ.. ఎవరి వ్యూహాలు వారివే. ఇద్దరూ బాహాటంగా విమర్శలు చేసుకోరు. ఎవరి లెక్కలు వారివే. ఉత్తమ్ పీసీసీ చీఫ్గా చేసి ఉండటంతో కాంగ్రెస్లో చాలా మంది నాయకులు ఆయనతో టచ్లో ఉన్నారు. ప్రస్తుతం రేవంత్, ఉత్తమ్ కలిసి ఉన్నారా? లేదా అన్నది గాంధీభవన్ వర్గాలకే అంతుచిక్కదు.
భట్టి పాదయాత్రకు రేవంత్ మద్దతు
అదేవిధంగా రేవంత్రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క మధ్య థిక్ ఫ్రెండ్షిప్ అయితే లేదు. పార్టీ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య సంప్రదింపులు ఉంటాయి. ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి చేస్తున్న పాదయాత్రకు పీసీసీ చీఫ్గా రేవంత్ మద్దతు పలికారట. సాధారణంగా పార్టీలో సొంత నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తే పెద్ద రచ్చ అవుతుంది. భట్టి యాత్రపై గాంధీభవన్ నుంచి ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు.
సంయమనం పాటిస్తున్న నలుగురు నేతలు
ప్రస్తుతం భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్లు ఒకరి అభిప్రాయాలు మరొకరు షేర్ చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరగడంతో..ఆ విషయంపై ఉత్తమ్ మాట్లాడతారని చెప్పారు రేవంత్. అలాగే భట్టి పాదయాత్ర విషయంలో గాంధీభవన్ నుంచి డైలీ పొలిటికల్ డెవలప్మెంట్లు, యాత్ర అప్డేట్స్ మీడియాలో సమన్వయం చేసుకోవాలని పీసీసీ చీఫ్ నుంచి పీఆర్వోకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి ఎవరు ఏ మంత్రం వేశారో.. లేక వాళ్లే తెలుసుకున్నారో కానీ.. నేతలు సంయమనం పాటించడం మొదలైంది. మరి..ఈ ఐక్యతారాగం బలపడుతుందో.. మధ్యలోనే పాత కాంగ్రెస్ను పరిచయం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
-
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
-
Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
-
Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!