Telangana Congress Politics :టీ కాంగ్రెస్ లో గాలి దుమారం.. ఇద్దరి సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress Politics
టీ కాంగ్రెస్లో గాలి దుమారం… ఇద్దరు సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా? పదవి విషయంలో వచ్చిన పొరపచ్చాలు.. పంతాలు అగ్గి రాజేస్తున్నాయా?. ఇంతకీ ఏంటా వైరం? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తెలంగాణ కాంగ్రెస్లో కామన్. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది లేదు. భేదాభిప్రాయాలతోనే సమస్య. పార్టీలో ఇదే ఇప్పుడు తలనొప్పి. పీసీసీ చీఫ్ రేవంత్కి సన్నిహితంగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. ప్రస్తుతం ఆయనతో దూరం పాటిస్తున్నారు. ఆ పంచాయితీపైనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్లో అనుబంధ సంఘాల్లో మార్పులు..చేర్పులు చేయాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికల విధానంతో వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి.. NSUI అధ్యక్షుడు వెంకట్ పదవుల్లో మార్పులు లేవు. మిగిలిన కమిటీల ఛైర్మన్లను మార్చే ఆలోచనలో రేవంత్రెడ్డి ఉన్నారట. OBC సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ను మార్చాలని అనుకుంటున్నారట. ఆ పదవిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్గా ఉన్న గాలి అనిల్ కుమార్కు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు టాక్. ఈ మేరకు రేవంత్ లేఖ కూడా రాశారట. మహిళా కాంగ్రెస్ పట్ల కూడా పీసీసీ చీఫ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విభాగాన్ని పీసీసీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోనూ మహిళా కాంగ్రెస్ విభాగం పార్టీ పనిని షేర్ చేసుకోవడం లేదట.
అందుకే ఆ విభాగాన్ని ప్రక్షాళించాలని చూస్తున్నారట రేవంత్. SC విభాగం ఛైర్మన్ ప్రీతం పార్టీలోని అన్ని గ్రూపులు.. నాయకులతో లౌక్యంగా వెళ్తున్నారు. దాంతో ప్రీతమ్ను కదిలించబోరని సమాచారం.
OBC ఛైర్మన్ మార్పు విషయంలోనే దామోదర రాజనర్సింహ, రేవంత్ మధ్య గొడవ జరుగుతోందట. గాలి అనిల్కు అనుకూలంగా రేవంత్ లేఖ రాయడాన్ని తప్పు పడుతున్నారట. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేసేవారికి కాకుండా ఇంకెవరికైనా ఆ పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారట రాజనర్సింహ. దీంతో ఇద్దరి మధ్య ఈ పంచాయితీ తెగేవరకు వెళ్తుందా.. మధ్యలోనే సర్దుకుంటుందా అనే చర్చ సాగుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. OBC ఛైర్మన్గా శ్రీకాంత్ను కొనసాగించే ఆలోచన రేవంత్కు లేదట. పీసీసీ కార్యక్రమాలను ఆయన పట్టించుకోవడం లేదనే అభిప్రాయంలో ఉన్నారట. అయితే శ్రీకాంత్కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్ మద్దతిస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్లో మరో రచ్చకు కేంద్రం కావొచ్చని సందేహిస్తున్నారు. ముఖ్య నేతల మధ్య తలెత్తుతున్న ఈ అభిప్రాయ భేదాలు .. ఢిల్లీ వరకు వెళ్తాయో.. గాంధీభవన్లోనే సమసి పోతాయో చూడాలి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!