Station Ghanpur TRS Politics టీఆర్ఎస్లో చిటపటలు..ఘనపూర్లో నేతల వర్గ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Station Ghanpur TRS Politics : నియోజకవర్గానికి మంత్రి వచ్చినా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? ఒకరు హాజరై.. మరొకరు డుమ్మా కొట్టడం వెనక ఆధిపత్యపోరాటమే కారణమా? కుమ్ములాటలు పెరగడమే తప్ప.. తగ్గే సంకేతాలు కనిపించడం లేదా? లెట్స్ వాచ్..!
ఆ మధ్య మాటల తూటాలతో పరస్పరం విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అధికారపార్టీలోని ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పాత పగలు మళ్లీ బుసకొట్టాయి. రెండు శిబిరాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరైనా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డుమ్మా కొట్టేశారు. జిల్లాకు చెందిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం దూరంగానే ఉన్నారు. దీంతో అధికారపార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరాటం కొత్త పుంతలు తొక్కుతుందోనే చర్చ నడుస్తోంది.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
చెరువుల్లో చేప పిల్లలను వదలడంతోపాటు.. గొర్రెల పెంపకం దార్లతో మంత్రి తలసాని సమావేశం అయ్యారు. స్టేషన్ ఘనపూర్లో కార్యక్రమం జరగడంతో అక్కడి ఎమ్మెల్యేగా రాజయ్య వచ్చారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ శ్రీహరి మాత్రం సైలెంట్ అయ్యారు. కొద్దిరోజులుగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం వల్లే శ్రీహరి రాలేదని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఆశిస్తూ.. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. ప్రజల అటెన్షన్ తీసుకొచ్చేలా విమర్శలు చేసుకోవడం ఆ ప్లాన్లో భాగమనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎవరి గ్రూపు వారిదే.
ఎవరికి వారే స్టేషన్ ఘనపూర్ను తమ అడ్డాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆరోపణల తీవ్రతా శ్రుతిమించుతోంది. ఏకంగా మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారు రాజయ్య, శ్రీహరి. ఇద్దరూ సీనియర్ లీడర్లే కావడంతో జిల్లా నేతలు వీళ్లకు సర్దిచెప్పలేని పరిస్థితి ఉందట. అధిష్ఠానం కలుగ చేసుకుంటే కానీ.. సమస్య కొలిక్కి రాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు మంత్రులు వచ్చినా ఒకరినొకరు ఎదురు పడటానికి ఇష్ట పడటం లేదు. మరి.. ఈ వర్గపోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!