Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record September 17 Heat In Hyderabad

Telangana National Integration Day :హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 హీట్

Published Date :September 15, 2022 , 12:25 pm
By Premchand Chowdary
Telangana National Integration Day :హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 హీట్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సెప్టెంబర్‌ 17 దగ్గర పడేకొద్దీ.. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడమే దానికి కారణం. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణలో గులాబీ, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య కూడా ఆ వార్‌ ప్రభావం కనిపిస్తోంది. నిత్యం రెండు పార్టీల నేతలది మాటలయుద్ధమే. అదీ తీవ్ర పరుష పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ప్రస్తుతం రెండు శిబిరాల మధ్య సెప్టెంబర్‌ 17పై వివాదం జరుగుతోంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుంటే.. జాతీయ సమైక్యతా దినం పేరుతో చేపట్టే కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హైదరాబాద్‌ వేదికగా పోటాపోటీ కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి కూడా. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సర్కార్‌ నిర్వహించే కార్యక్రమానికి సెంట్రల్ హోంమినిస్టర్‌ అమిత్‌ షా హాజరవుతున్నారు.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

పరేడ్‌ గ్రౌండ్స్‌ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్టహాసంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే రెండు ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం ప్రకటనల గొడవ నడుస్తోంది. ఫ్లెక్సీల వార్‌ పీక్స్‌కు చేరుకుంటోంది. విమోచన వేడుకల పేరుతో చేపట్టే కార్యక్రమాలను ప్రచారం చేసుకునేందుకు వివిధ వేదికలను ఉపయోగించుకోవాలని కేంద్ర సర్కార్ చూస్తోంది. మెట్రో పిల్లర్లపై కేంద్రం యాడ్స్‌ వేయాలని ప్రణాళికలు వేసింది. అయితే మెట్రోపిల్లర్ల దగ్గర ఉన్న ప్రకటనల సైన్‌ బోర్డులన్నింటినీ టీఆర్ఎస్‌ సర్కార్‌ ముందుగానే బుక్‌ చేసేసుకుంది. నగరంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కకుండా ముందస్తు ప్లాన్‌ వేసింది గులాబీ శిబిరం. ప్రకటనల సంస్థలతో వారం రోజులు ముందుగానే ఒప్పందాలు చేసేసుకుందట. చివరకు సిటీ బస్టాప్‌ల దగ్గర ఉండే సైన్‌బోర్డుల స్లాట్‌లు కూడా రాష్ట్రసర్కారే బుక్‌ చేసేసిందట. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అభ్యంతరం తెలిపారు. ప్రకటనలు చేసుకునేందుకు తమకూ కొన్ని స్లాట్లు ఇవ్వాలని అడిగినట్టు తెలుస్తోంది.

ఇదే కాదు.. సెప్టెంబర్‌ 17న చేపట్టే కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున అడిగారట. అప్పటికే బస్సులను రాష్ట్ర సర్కార్‌ బ్లాక్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బస్సులు అందుబాటులో లేవని ఆర్టీసీ యాజమాన్యం బదులిచ్చిందట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారికంగా లెటర్‌ ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేయడంతో.. బస్సుల రెంట్ పెంచేసినట్టు బీజేపీ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా రెండు పార్టీల వార్‌ ఇలాగే నడిచింది. పోటాపోటీగా ఫ్లెక్సీలు పెట్టుకుని కవ్వింపు చర్యలకు దిగారు. నాడు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ సభకు దారితీసే రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వ సైన్‌బోర్డులే కనిపించాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్‌ అవుతుందనే వాదన ఉంది. రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో కేంద్ర సర్కార్‌ ఆలస్యంగా మేల్కొనడంపైనా బీజేపీలోనే భిన్న వాదనలు ఉన్నాయట. జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఎదురైన ఘటనలను గుర్తు చేసుకునైనా ముందే ఎందుకు మేల్కోలేదని ప్రశ్నిస్తున్నారట. మొత్తానికి సందర్భం ఏదైనా.. టీఆర్ఎస్‌, బీజేపీల వార్‌ కామన్‌గా మారిపోయింది. మరి.. సెప్టెంబర్‌ 17న పోటాపోటీగా ఎలాంటి సిత్రాలు కనిపిస్తాయో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharatiya Janata Party
  • Secunderabad's Parade Ground
  • Telangana Flexi War
  • Telangana National Integration Day
  • Telangana Rashtra Samithi

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions