OTR : రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మాటల యుద్ధం ముగిసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధం… మాటల యుద్ధం…..అదీకూడా అలా ఇలా కాదు. ఇద్దరు కీలక నేతల మధ్య ఓ…. రేంజ్ పొలిటికల్ వార్. తరిమి కొడతామని ఒకాయన అంటే….. అలాంటోడు ఇంకా పుట్టలేదంటూ మరొకాయన స్ట్రాంగ్ రియాక్షన్. తెలంగాణ పాలిటిక్స్లో కావాల్సినంత పొలిటికల్ హీట్. మరిప్పుడు ఢిల్లీ సాక్షిగా ఆ యుద్ధానికి తెరపడ్డట్టేనా? ఎవరేంటో క్లారిటీ వచ్చిందా? అసలు ఎవరా ముఖ్య నేతలు? ఆ ఎపిసోడ్కు సంబంధించి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాజకీయాలకు సంబంధించి హస్తినలో తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం చేసుకున్న రెండు పార్టీల నేతలు కలిశారు. కేంద్ర మంత్రువతో సమావేశమయ్యారు. ఇందులో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే, మరొకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నాళ్ళుగా వీరిద్దరూ పరస్పరం ఫైర్ అవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్లను కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని, అలాగే రాష్ట్రం నుంచి ధాన్యం కొనక పోతే సెంట్రల్ మినిస్టర్ ఇంటి ముందు తీసుకొచ్చి బస్తాలు పడేస్తామని అసలు కేంద్ర మంత్రిని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేట్కు అప్పు రాకుండా అడ్డుకున్నారని, వెంటనే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు సీఎం. అదే ఊపులో కాస్త పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించారు. అలాగే అపాయింట్మెంట్ కోసం బహిరంగ లేఖ కూడా రాశారాయన. ఈ క్రమంలో… ముఖ్యమంత్రికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. తెలంగాణ నుంచి నన్ను తరిమి కొట్టే వాడు ఇంకా పుట్టలేదంటూ బదులిచ్చారు.
అసలు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే అడ్డు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. రాష్ట్రానికి నిధులు రాకుండా, అప్పు పుట్టకుండా నేను ఎక్కడ అడ్డుకున్నానో నిరూపించాలంటూ సీఎంకు సవాల్ చేశారు. ఆ రకంగా ఇద్దరి మధ్య పంచాయితీ గట్టిగానే నడిచింది. దీంతో అసలు వీళ్లిద్దరి మధ్య మాటలు ఈ స్థాయిలో మాటలు ఎందుకు పేలుతున్నాయి? ఎక్కడ తేడా కొట్టిందంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు చెప్పేసుకున్నారు కూడా. ఆ వ్యవహారం అలా నడుస్తుండగానే… సడన్గా సీన్ మారిపోయింది. ఇద్దరు ముఖ్యులు ఢిల్లీలో కలిశారు. ఏ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ అయితే ఇప్పించమని సీఎం రేవంత్ కిషన్రెడ్డిని అడిగారో…. అదే మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. కలిసి మాట్లాడి సానుకూల స్పందన వచ్చిందని కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి అడుగారు…. నేను అపాయింట్మెంట్ ఇప్పించాను అంటూ…X లో పోస్ట్ చేశారు కిషన్. దీంతో… ఈ ఇద్దరి నేతల మధ్య పంచాయితీ ఇక ముగిసినట్టేనా… ఇకపై రేవంత్ రెడ్డ్ … కిషన్ రెడ్డిని టార్గెట్ చేయరా…? అంటూ చర్చలు మొదలయ్యాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎపిసోడ్ పై రెండు పార్టీల్లో విస్తృత చర్చలే జరుగుతున్నాయి. ఇందులో ఎవరిది పైచేయి అంటూ రకరకాలుగా విశ్లేషిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. అవి రాజకీయ కారణాలా? మరొకటా అన్న సంగతి అలా ఉంచితే….. మాటల మంటలు ఇకనైనా చల్లబడతాయా లేక మరో రూపంలో మళ్ళీ రేగుతాయా అన్నది ప్రస్తుతానికి ఉన్న పొలిటికల్ డౌట్.
Also Read
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!