Off The Record: చాలా రోజుల తర్వాత హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలని అధిష్టానం పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…పాటుగా మంత్రులు… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ పిలిచింది. గతంలో ఎన్నికల సందర్భంగా అందరినీ ఏకం చేసేందుకు ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశం తిరిగి గురువారం జరగబోతోంది. ఢిల్లీలో జరిగే మీటింగ్ పై పార్టీలోలో… పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల మంత్రుల మధ్య వివాదాలు…మంత్రులు చేసిన గలాటాలు…కొంత మంది మంత్రులపై సొంత పార్టీ MLA లు ఫిర్యాదులు లాంటి అంశాలన్నీ ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఎలాగూ అడపా దడపా వెళ్ళే ఫిర్యాదులు కూడా ఉండనే ఉన్నాయి. వీటన్నింటిపై అధిష్టానం సీరియస్ గానే చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐతే… పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా జరుగుతున్న సమావేశం కావడం… సరిగ్గా ఇదే సమయానికి అటు సర్పంచ్.. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలుచుకోవడం లాంటి అంశాలు.. పార్టీకి…ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలు. రెండేళ్ల పాలనలో సరిదిద్దుకోవాల్సినన అంశాలపై దిశా నిర్దేశం చేయబోతుంది అధిష్టానం. ప్రభుత్వం సాఫీగా సాగుతున్నా… పరిపాలన పరంగా .. పోస్టింగులు… నియామకాల విషయంలో తన..పర అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని…కొంత మంది అధికారులు MLA లు…పార్టీ నాయకులకు కూడా పని చేయడం లేదనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. దీనిపై ఫోకస్ పెట్టాలనే సూచన కూడా చేయాలని చూస్తున్నారు కొందరు నేతలు.
పార్టీలో పదవులు… నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చకి రానుంది. పార్టీ నిర్మాణం మీద … పార్టీలో ఖాళీ గా ఉన్న పదవులు లాంటి అంశాలపై డిల్లీ మీటింగ్ తర్వాత క్లారిటీ రాబోతుంది.