Off The Record: మంత్రి జూపల్లికి సీనియర్ ఆఫీసర్స్ కి తగాదాలున్నాయా?
- ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్విపై మంత్రి జూపల్లి ఆరోపణలు..
- తన ఆదేశాలను పట్టించుకోవడం లేదని సీఎస్కు లేఖ..
- మంత్రి లేఖ తర్వాత వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న రిజ్వి..
- ఈనెల 31 నుంచి అమల్లోకి అంటూ సీఎస్ ఉత్తర్వులు..
- వీఆర్ఎస్కు అనుమతి ఇవ్వవద్దని సీఎం, సీఎస్కు జూపల్లి మరో లేఖ..
- తన విషయంలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు..
- హాలోగ్రామ్స్ కాంట్రాక్ట్ కొనసాగింపుపై అనుమానాలు..
- రిజ్వి ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేశారన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు తన మాటను ఖాతరు చేయడం లేదని, ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారాయన. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఇద్దరూ తన ఆదేశాల్ని పట్టించుకోకుండా… విధులకు ఆటంకాలు సృష్టిస్తున్నారన్నది మంత్రి బాధ. అయితే… లేఖ తర్వాత ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. మంత్రి తనమీద సీఎస్కు ఫిర్యాదు చేయడాన్ని సీరియస్గా తీసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి….స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వీఆర్ఎస్కు అనుమతిస్తూ… సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు కూడా. అంతలోనే ఇంకో ట్విస్ట్ ఇచ్చారు మంత్రి. వీఆర్ఎస్కు రిజ్వీ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించ వద్దంటూ… సీఎస్కు మరో లేఖ రాశారాయన. ఈ నెల 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని బుధవారమే ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు చీఫ్ సెక్రెటరీ.
ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రెండో లేఖ ఇటు రాజకీయ వర్గాలు, అటు బ్యూరోక్రాట్స్లో చర్చనీయాంశం అయింది. మంత్రి లేఖతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో అంతర్గత విభేదాలు బయటపడ్డట్టయింది. రిజ్వీ వీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దంటూ… సీఎస్తో వదిలిపెట్టకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా మంత్రి జూపల్లి లేఖ రాయడం ఇంకా కాక పెంచుతోంది. తన విషయంలో రిజ్వీ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా… అక్రమాలకు పాల్పడ్డారంటూ తాజా లేఖలో ఆరోపించారు జూపల్లి.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. మంత్రిగా తన విధులకు కూడా ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. మద్యం బాటిళ్లపై సెక్యూరిటీ కోసం వేసే హాలోగ్రామ్ స్టిక్కర్ల కాంట్రాక్టును 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి ఇస్తున్నారని, మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా కనీసం పట్టించుకోలేదని, మళ్లీ పాత వారికే కాంట్రాక్టు కట్టబెట్టారని లేఖలో ప్రస్తావించారు జూపల్లి.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఇక చిట్టి సృజన్ కేసులో బకాయిలతో పాటు కాంపౌండింగ్ ఫీజు విషయంలో ఇచ్చిన సూచనలను రిజ్వీ పెడచెవిన పెట్టారని తెలిపారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి 6 కోట్ల 15 లక్షల రూపాయల్ని డెమరేజ్ చార్జీల కింద చట్టవిరుద్ధంగా వసూలుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించారంటూ ఫైర్ అయ్యారు మినిస్టర్. టీజీబీసీఎల్ ఎండీ అడిగినా వివరాలు ఇవ్వకపోవడం దారుణమని, ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో చేసిన జాప్యంతో సర్కార్ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందంటూ… సీఎం, సీఎస్కు రాసిన లేఖలో ఆరోపించారు జూపల్లి కృష్ణారావు. మరోవైపు లేబుల్స్, హాలోగ్రామ్ టెండర్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకే నడుచుకున్నామని… ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఫైల్స్ మూవ్ చేశామంటున్నారు ఆఫీసర్స్. తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పనులు చేయలేదని… విధుల పట్ల నిర్లక్ష్యం వహించ లేదని చెబుతున్నారు. మంత్రి ఆదేశాలపై సీఎంవో అధికారులకు ఎప్పుడో సమాచారం ఇచ్చామని వివరణ ఇస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో రిజ్వీ వీఆర్ఎస్పై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనన్నది ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!