తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సంప్రదాయం..వారికి మాత్రమే టికెట్లటా
తెలంగాణ కాంగ్రెస్ మరో కొత్త సంప్రదాయానికి తెర తీయాలని చూస్తోంది. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశం మొదలుకొని…ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కూడా టికెట్ల కేటాయింపుపై ఒకే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆఖరి వరకు కాకుండా…అరు నెల్ల ముందే అభ్యర్థుల ప్రకటన ఉండాలని చర్చకు పెట్టారు నేతలు. మార్చిలో ఢిల్లీలో జరిగిన సమావేశం లో కూడా సీనియర్ నేతలకు కూడా క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఐతే టికెట్ల కేటాయింపులో ప్రామాణికం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్లో. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో జనం లో ఉండే వారికి…సమస్యలపై పోరాటం చేసిన వారికి టికెట్లు అని చెప్పడంతో ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారు…ఏం చేస్తారు అనే టాక్ మొదలైంది.
కాంగ్రెస్కు ఇన్నాళ్లు వ్యూహకర్తలు లేరు.. కానీ ఇప్పుడు సునీల్ అనే వ్యూహకర్తను తెచ్చుకుంది. ఇప్పటికే సునీల్..పార్టీలో అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా అయన కూర్చుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేశారట. అభ్యర్ధుల ఎంపిక మీదా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు సమాచారం. అభ్యర్ధుల ఎంపికపై..రెండు మూడు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఒకే నియోజక వర్గం నుంచి…రెండు సార్లు పోటీ చేసి ఓడిపోతే…టికెట్ ఇవ్వకూడదనే సూచన చేసినట్టు సమాచారం. ఐతే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన వారిలో…సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఒక్క ఇంట్లో రెండు సీట్లు వద్దనే పంచాయతీకి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ…ఇప్పుడు ఇంకో లిటిగేషన్ వచ్చి పడేట్టు కనిపిస్తోంది. ఒక నియోజకవర్గం నుండి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోతే టికెట్ వచ్చే ఎన్నికల్లో ఇవ్వద్దనే చర్చ జరుగుతోందట.
Also Read
2018 ఎన్నికలో ఎవరెవరు ఎక్కడ..ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారనే లెక్కలు తిశారట. దీని ప్రకారమే… అంచనాలు వేస్తున్నారు అని టాక్. వరుస ఓటములు చవిచూస్తున్న నాయకులను ఈసారి పక్కన పెట్టాలని సూచన ప్రాయంగా అధిష్టానానికి చెప్పినట్టు ప్రచారం నడుస్తోంది. రెండుసార్లు ఓడిపోయిన తరువాత .. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తే సానుభూతి కలిసి వస్తుందనే చర్చ సైతం నడుస్తోంది. క్షేత్ర స్థాయిలో నివేదిక ప్రకారం టికెట్ల ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ల ఇవ్వరా?గ్రౌండ్లో బలంగా ఉంటే..పార్టీ తన ఆలోచనా కూడా మార్చుకుంటుందా?అనేదే చూడాల్సి ఉంది.
2018లోనే ప్యారాచుట్లకు టికెట్లు రావు…అని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ…నామినేషన్కి ఆఖరు రోజు అనగా.. ఓ ముగ్గురు నాయకులను పిలిచి నల్గొండ జిల్లాలో ఒకరిని…హైదరాబద్లో ఇంకొకరిని పోటీ చేయించింది పార్టీ. 2018లో జరిగిన వ్యవహరం మళ్లీ రిపీట్ కాదా?ఇప్పుడు చెప్పిన మాటే ఫైనల్ అయినట్టా?అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!