Munugode candidate : మునుగోడు అభ్యర్థి పై తర్జన భర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు మొనగాడు ఎవరు? బీజేపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చినా.. TRS, కాంగ్రెస్ ఎంతుకు తర్జన భర్జన పడుతున్నాయి? అంతర్గత పంచాయితీలు రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయా? అభ్యర్థి పేరు ప్రతిపాదించడానికి కాంగ్రెస్లో సీనియర్లు ఎందుకు జంకుతున్నారు?
మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థి ప్రకటన అధికార TRS, కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా మారిపోయింది. సొంతపార్టీలో రేగిన కుంపటితో కొంత తటపటాయిస్తోంది టీఆర్ఎస్. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ నిర్వహించిన రోజే.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారని భావించారు. కానీ, అభ్యర్థి ప్రకటన లేకుండానే సభ ముగిసింది. మునుగోడులో టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు.. కూసుకుంట్లపై అసమ్మతి ప్రకటించారు. కొందరు ప్రత్యేక సమావేశాలు పెడితే.. ఇంకొందరు పార్టీ కూడా మారిపోయారు. సీఎం కేసీఆర్ దగ్గరకు ఈ అసంతృప్తుల గోల వెళ్లింది. పైకి కలిసి ఉన్నట్టుగానే చెబుతున్నా.. తెరవెనక ఏదో తేడా కొడుతోందట.
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
గతంలో సొంత పార్టీ నాయకుల మీదనే.. కూసుకుంట్ల కేసులు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ. నారాయణపురం, చండూరు, మర్రిగుడెం, నాంపల్లి మండలాల్లో కీలకంగా పని చేస్తున్న టీఆర్ఎస్ నేతలతో మాజీ ఎమ్మెల్యేకు గ్యాప్ వచ్చిందట. ఉపఎన్నికలో కూసుకుంట్లకి టికెట్ ఇస్తే.. వచ్చే సాధారణ ఎన్నికల వరకు వేధింపులు తప్పవనే ఆలోచనలో ఉన్నారు అసమ్మతి నేతలు. అభ్యర్ధి ప్రకటనకంటే ముందే తలనొప్పి రావడంతో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వంటి బీసీ నేతలు తెరమీదకు వచ్చారు. మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ కావడంతో ఆ వర్గానికి టికెట్ ఇవ్వాలనే ప్రచారం జోరందుకుంది. అందుకే క్యాండిడేట్ను ప్రకటించలేదని సమాచారం.
కాంగ్రెస్లో కూడా సేమ్ సీన్. మునుగోడులో అభ్యర్ధి ఎవరనే దానిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఫైనల్గా రెండు పేర్లు చర్చకు వచ్చాయి. పాల్వాయి స్రవంతి.. చల్లమల కృష్ణారెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై.. సీనియర్ల అభిప్రాయం తీసుకుంటున్నారట. అయితే సీనియర్ నాయకులు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వండి అని పక్కకు తప్పుకొంటున్నారట. ఫలానా వారికి టికెట్ ఇవ్వాలని చెప్పడానికి భయపడుతున్నారట. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కూడా… మీరే నిర్ణయం తీసుకోండి అని చేతులు దులిపేసుకుంటున్నారట.
మునుగోడులో ఫలితం తేడాగా వస్తే దానికి తమను బాధ్యులను చేస్తారని సీనియర్లు జంకుతున్నారట. అందుకే ముందుకు రావడం లేదని తెలుస్తోంది. స్రవంతికి టికెట్ ఇవ్వాలని చెబుతున్నా.. ఉపఎన్నికలో ధన ప్రభావానికి ఆమె తట్టుకోగలరా అనేది ప్రశ్న. కాంగ్రెస్ సీనియర్లకు మౌనానికి అది కూడా కారణమట. పీసీసీ చీఫ్కే ఆ నిర్ణయాన్ని వదిలేస్తే పోలా అన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. ఫలితాల తర్వాత..పిసిసిని తప్పు పట్టడానికి ఓ ఆప్షన్ ఉండాలని భావించేవారు లేకపోలేదు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత మాత్రం స్రవంతికి టికెట్ ఇస్తే గెలిపిస్తామని చెప్పారట. ప్రచారానికి వస్తారో రారో తెలియని సదరు నాయకుడి సలహాపై పార్టీ కూడా ఆలోచనలో పడిందట.
పిసిసి చీఫ్ రేవంత్ మాత్రం ప్రియాంక గాంధీ సూచన కోసం ఎదురు చూస్తున్నారట. మునుగోడు ఉప ఎన్నిక.. చావో రేవో లాంటి సమస్య. రేవంత్ నాయకత్వానికి కూడా ఇవి సవాల్. సొంత పార్టీ నాయకుల తలనొప్పులు కూడా తోడవడంతో రేవంత్ ఏం చేస్తారు అనేది ప్రశ్న. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మరి ఎప్పటికి క్లారిటీ ఇస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!