Kamalapuram Seat Sentiment.. Off The Record: కమలాపురంలో ఆ సెంటిమెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత చరిత్ర.. గెలుపోటముల జాబితా.. అక్కడి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయా? సెంటిమెంట్ను ఆ ఎమ్మెల్యే అధిగమిస్తారా.. లేక కొత్త ఎత్తుగడ వేస్తారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?
వరుసగా రెండుసార్లు గెలిచినవాళ్లు మూడోసారి ఓడిపోతారా?
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం. రాజకీయంగా ఈ సెగ్మెంట్కు ఎంతో చరిత్ర ఉంది. అంతే సెంటిమెంట్ కూడా కమలాపురంతో ముడిపడి ఉంది. వరసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి.. మూడోసారి ఓడిపోతారనే వాదన స్థానికంగా బలంగా వినిపిస్తుంటుంది. గతంలో జరిగింది అదే… అని గుర్తు చేస్తూ.. భవిష్యత్లోనూ రిపీట్ అవుతుందా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనం. ఆ క్రమంలోనే సీఎం జగన్ మేనమామ.. సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి చుట్టు అధికార పార్టీలో చర్చించుకుంటున్న పరిస్థితి ఉందట.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
2014, 2019లో కమలాపురంలో రవీంద్రనాథ్రెడ్డి గెలుపు
2014, 2019 ఎన్నికల్లో వరుసగా కమలాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రవీంద్రనాథ్రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని అనుకుంటున్నా.. ఈ నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తోంది. గతంలో ఇదే కమలాపురం నుంచి మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి రెండుసార్లు వరుసగా గెలిచి మూడోసారి ఓడిపోయారు. మైసూరాపై గెలిచిన వీరశివారెడ్డిది సైతం అదే చరిత్ర. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి సైతం వరుసగా మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. నాలుగోసారి బరిలో ఉండాలని పుత్తా భావిస్తున్నా.. ఆయనకు టీడీపీ టికెట్ ఇస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పునరాలోచనలో పడ్డారనే వాళ్లూ ఉన్నారు. పాత సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో రిపీటైతే పరిస్థితి ఏంటనే సందేహం లోకల్ వైసీపీ నేతల్లోనూ ఉందట. ప్రస్తుతం కమలాపురం వైసీపీకి కంచుకోటగా ఉన్నప్పటికీ.. సెంటిమెంటే వారిని కలవర పెడుతోందట.
కమలాపురంలో కుమారుడిని బరిలో దించుతారా?
ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి సెంటమెంట్లను ఎక్కువగానే విశ్వసిస్తారని టాక్. ఏ పని మొదలు పెట్టాలన్నా మంచిచెడ్డలు ఆరా తీస్తారట. ముహూర్తాలు చూసుకుంటారట. అందుకే అధికారపార్టీ శ్రేణుల్లోనూ చర్చ నడుస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమారుడు నరేన్ రామాంజులరెడ్డిని సీకేదిన్నె జడ్పీటీసీగా రాజకీయ ప్రవేశం చేయించారు రవీంద్రనాథ్రెడ్డి. ఆ మధ్య కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అని ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు సెంటిమెంట్ అడ్డొస్తే.. రామాంజులరెడ్డిని కమలాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ లెక్కలు కుదరకపోతే.. జిల్లాలోనే మరోచోట నుంచి రవీంద్రనాథ్రెడ్డి పోటీ చేయొచ్చనే టాక్ నడుస్తోందట. సెంటిమెంట్ అలాగే.. నియోజకవర్గ మార్పుపై రవీంద్రనాథ్రెడ్డి స్పందించకపోయినా.. ఆయన కేంద్రంగా కమలాపురం వైసీపీలో చర్చ అయితే జరిగిపోతోంది. మరి.. ఎమ్మెల్యే ఏం చేస్తారో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!