Erra Shekhar : ఆ నాయకుడి చేరికతో పార్టీ దిక్కు తోచని స్థితిలో పడిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్ర శేఖర్. టీడీపీ నుంచి బీజేపీలోకి అటు నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే. కొన్నాళ్లుగా ఎర్ర శేఖర్ చేరికపై పార్టీలో చర్చ జరుగుతున్నా.. ఈ మధ్య ఆటంకాలు అధిగమించి.. పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్లో అలజడి మొదలైంది. ఇప్పటికే మాజీ ఎంపీ మల్లు రవి.. యువ నేత అనిరుధ్రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ రాజకీయాలను రక్తికట్టిస్తుంటే.. ఇప్పుడు కొత్తగ ఎర్ర శేఖర్ ఎంట్రీతో రాజకీయం ఇంకా రసవత్తరంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందో కానీ.. నేతల శిబిరాల్లో మాత్రం కదలికలు పెరిగాయి.
2019 లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసి ఓడిన మల్లు రవి.. మరోసారి అక్కడి నుంచే పోటి చేసే ఆలోచనలో ఉంటే.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీసులతో జడ్చర్ల అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు అనిరుధ్రెడ్డి. ఒకానొక దశలో కోమటిరెడ్డి సహకారంతో ఎర్ర శేఖర్ ఎంట్రీని అడ్డుకున్నారు అనిరుధ్రెడ్డి. కానీ.. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. సమస్యను ఓ సవాల్గా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఢిల్లీ వెళ్లి ఎర్ర శేఖర్ చేరికకు లైన్ క్లియర్ చేసుకొచ్చారని టాక్. ఈ కారణంతో ఎర్ర శేఖర్ పీసీసీ చీఫ్కు సన్నిహితం అయ్యారు.
Also Read
నల్లగొండ జిల్లాలో జోక్యం చేసుకోకుండా కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ కుతకుత లాడుతున్నారు. పైగా తన సొంతజిల్లా ఉమ్మడి మహబూబ్నగర్లో చేరికలను సైతం ఆయన అడ్డుకోవడాన్ని పీసీసీ చీఫ్ ప్రెస్టీజీగా తీసుకున్నారట. జడ్చర్లలో కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకే పీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు భావిస్తున్నారు. ఎర్ర శేఖర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా చేయడం.. బీసీ నేత కావడంతో అక్కడ పాగా వేయడం పెద్ద కష్టం కాదనే లెక్కల్లో ఉన్నారట రేవంత్. ఆ వివరాలు ఢిల్లీ పెద్దలకు చెప్పే చకచకా పావులు కదిపినట్టు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ కండువా కప్పుకోగానే.. జడ్చర్లలో దూకుడు పెంచారు ఎర్ర శేఖర్. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన అనుచర వర్గాన్ని పలకరిస్తూనే.. గతంలో తన వెన్నంటి ఉండి.. ఇప్పుడు ఇతర పార్టీలలో కొనసాగుతున్న వారితోనూ టచ్లోకి వెళ్తున్నారట. తన సామాజికవర్గ ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. పనిలో పనిగా.. పాత కాంగ్రెస్ కాపులు.. మల్లు రవి అనుచరులు, రేవంత్ వర్గం కూడా ఎర్ర శేఖర్కు కనెక్ట్ అవుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ తనకే జడ్చర్ల టికెట్ అని భావించిన అనిరుధ్రెడ్డికి తాజా పరిణామాలు రుచించడం లేదట. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ జడ్చర్ల కాంగ్రెస్ రాజకీయం మరింత రంజుగా మారుతుందని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?