Prathipadu Assembly constituency : కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ సీటు కోసం ఫైట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prathipadu Assembly constituency : ఆ ఎమ్మెల్యేకి సొంత కుటుంబం నుంచే అసమ్మతి సెగ మొదలైంది. అది క్రమంగా విస్తరిస్తోంది. మొదటినుంచి పార్టీలో ఉన్నవాళ్లకు కాకుండా, ఎమ్మెల్యే తన అనుచరులకు ప్రయార్టీ ఇస్తున్నారనేది అక్కడ ప్రధాన సమస్య. అయితే ఈ ఎపిసోడ్ వెనుక, సీటుకోసం కాచుకు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఉందట.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైసీపీ సీటుకోసం ఫైట్ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. సీటు మీద కన్నేసిన ఆ మాజీ ఎమ్మెల్యేనే అసమ్మతి గ్యాగ్ వెనుక ఉండి నడిపిపిస్తున్నారని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ప్రత్తిపాడు వైసిపి ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ 2019లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీలు ఏవైనా ఇక్కడ పర్వత, వరుపుల, ముద్రగడ ఫ్యామిలీలే విజయం సాధిస్తూ ఉంటాయి. ముందు నుంచి పర్వత ఫ్యామిలీ టిడిపిలో ఉండేది. ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నాన్న పర్వత చిట్టిబాబు గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున వరుపుల సుబ్బారావు, టిడిపి తరఫున చిట్టిబాబు బరిలో నిలవగా సుబ్బారావు విజయం సాధించారు. ఆ తర్వాత చిట్టిబాబు చనిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో వరపుల సుబ్బారావు టిడిపికి జై కొట్టి 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తిరిగి ఫ్యాన్ కిందకు వచ్చేసారు.. అప్పటికే ప్రత్తిపాడులో పర్వత చిట్టిబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కి వైసీపీ టిక్కెట్ కన్ఫమ్ చేసేసారు. ఆ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినప్పటికీ పదవి కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు వరుపుల. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా, తనకు గుర్తింపు లేదని భావిస్తున్నారట వరుపుల. ఆయన పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పిల్లి మొగ్గలు వేసే నేతలను చేరదీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మరో చిన్నాన్న పర్వత రాజబాబు శంఖవరం ఎంపీపీ గా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యేకు అసలు పడదట. గత ఎన్నికల్లో రాజబాబు భార్య ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు.. కానీ అవకాశం దక్కకపోవడంతో ఎం పీ పీ పదవి ఇచ్చి బుజ్జగించారు
నియోజవర్గంలో ప్రత్తిపాడు, శంకవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సొంత బాబాయి ఇప్పటికే, తిరుగుబాటు బావుటా ఎగరేస్తే, తాజాగా మరో ఎంపీపీ కూడా అందులో చేరారు. తాజాగా రౌతులపూడి ఎంపీపీ బహిరంగంగానే ఎమ్మెల్యే పై కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కనీసంగా కూడా తమను పట్టించుకోవడం లేదని మండల పరిషత్ సమావేశంలో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మెజార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాకుండా ఆయనతో పాటు వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులకు సైతం దానికి తగ్గట్లుగా ఆదేశాలిస్తున్నారట నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ అని తాను చెప్పిన వారికి పనులు చేసి పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారట. దాంతో లోకల్ లీడర్లు ఎమ్మెల్యే పై కుత కుత లాడిపోతున్నారట. పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఆయన మనుషులను చేరదీయడంపై సమావేశాలు పెట్టుకుంటున్నారట. పార్టీకి కాకుండా తనకు ప్రయారిటీ ఇవ్వాలన్న ఆయన కామెంట్స్ పై ఫ్యాన్ పార్టీ క్యాడర్లో పెద్ద చర్చే నడుస్తోందట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలతో పాటు మాజీ ఎమ్మెల్యే శిబిరాలలో ఎవరి వైపు వెళ్ళాలో కేడర్ తేల్చుకోలేకపోతోందట . దీంతో ఫ్యాన్ పార్టీలో మూడు పంచాయతీలు ఆరు సమావేశాలు అన్నట్లు తయారయ్యిందట పరిస్థితి.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!