OTR: మాధవ్ వ్యవహారశైలిపై ఏపీ బీజేపీలో అసహనం పెరుగుతోందా?
- మాధవ్ వ్యవహారశైలిపై ఏపీ బీజేపీలో అసహనం పెరుగుతోందా?
- ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా జరగడం లేదన్న చర్చ
- సిద్ధాంతాలు సరే.. ఓట్ బ్యాంక్ పెంచుకునేది ఎప్పుడన్న ప్రశ్న
- జనంలో రిజిస్టర్ అయ్యే కార్యక్రమాలు ఏవన్న క్వశ్చన్
- ఉన్నామంటే ఉన్నామన్నట్టు బండి లాగించేస్తున్నారన్న అభిప్రాయం
- మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని భావిస్తున్నారా?
- సొంతగా పుంజుకునే ప్రయత్నం చేయాలన్న సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత విచిత్రమైన వాతావరణం ఏపీ బీజేపీలో ఇప్పుడు కనిపిస్తోందని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సరైన ట్రాక్లో నడిపిస్తున్నారా లేదా అన్న అనుమానాలు ద్వితీయ శ్రేణికి వస్తున్నాయట. రాష్ట్ర పార్టీ అంతకు ముందు ఎలా ఉంది? ఇప్పుడు ఏ పంథాలో నడుస్తోంది? కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా ఎందుకు జరగడం లేదంటూ వాళ్ళలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పేరిట సిద్ధాంతాలు వల్లెవేయడం తప్ప చేస్తోందేం లేదన్న అభిప్రాయం స్టేట్ కేడర్లో బలపడుతోంది. పార్టీ బలపడాలంటే ఓట్ బ్యాంక్ను పెంచుకోవడం ముఖ్యమని, ఆ పని మానేసి ఎంతసేపూ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే… జనం రేపు అసలు ఈవీఎంలో కమలం వైపు చూస్తారా అన్నది వాళ్ళ ప్రశ్న.
READ ALSO: Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
Also Read
ఇంకొందరు నాయకులైతే కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మూడేళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా టైంపాస్ చేస్తే… ఎలాగని అడుగుతున్నారు. ఏ అంశంలోనూ ఓపెన్గా మాట్లాడటంలేదని, అలా ఉంటే… జనంలో రిజిస్టర్ అయ్యేది ఎలాగని అడుగుతోంది కాషాయ కేడర్. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని, అసలు సరైన అజెండానే లేకుండా…. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా బండి లాగించేస్తున్నారన్నది పార్టీలోని ఓ వర్గం అభిప్రాయం. అదే సమయంలో గతంతో పోల్చి చూసుకుంటున్నారు కొందరు. పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేనతో సమానంగా నడిచామని, ఇప్పుడు మాత్రం మనమింతే…. మనకు ఇంతవరకే అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నారట.
రాష్ట్ర అధ్యక్షుడంటే… దూకుడుగా ఉండాలి, కేడర్లో తిరగాలిగానీ… అదేదో ఢిల్లీ నాయకులు అడపాదడపా స్టేట్ టూర్కి వచ్చినట్టు బయటికి వచ్చి కేడర్ను కలవడం, అప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ గురించి కాకుండా…. సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడ్డం వల్ల ప్రయోజనం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్. సైద్ధాంతిక అంశాల గురించి కచ్చితంగా మాట్లాడాల్సిందేగానీ…. ఎప్పుడూ వాటి గురించి మాత్రమే చెబుతూ…. ఇతరత్రా కీలకమైన అంశాలను విస్మరిస్తే రాష్ట్రంలో పార్టీ ఎలా బలపడుతుందని అడుగుతున్నారు ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఏపీలో బీజేపీని బీసీల పార్టీగా చూపించాలని అనుకోవడం మంచిదేగాని…. ఆ దిశగా గట్టి కార్యాచరణ ఏదంటూ రాష్ట్ర పార్టీని నిలదీస్తున్నారు కార్యకర్తలు. కొందరైతే డైరెక్ట్ కామెంట్సే చేస్తున్నారట. వచ్చే మూడేళ్ళు ఎలాగూ అధికార భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఈ టైంలో కళ్ళు మూసుకుని టైంపాస్ చేస్తే… ఆ తర్వాతి సంగతి అప్పుడు చూసుకోవచ్చని మాధవ్ భావిస్తున్నారా అంటూ… డైరెక్ట్గా కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పార్టీలో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా ఏపీలో తెలుగుదేశం అనుబంధ పార్టీలా కాకుండా…. సొంతగా బలం పుంజుకునే దిశగా కార్యాచరణ ఉండాలన్నది కేడర్ మాట.
READ ALSO: OTR: టీజీవో, టీఎనీవో మధ్య కోల్డ్ వార్? డీఏ పెంపుతో బయటపడిందా ?
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!