గ్రేటర్ హైదరాబాద్ లో దిక్కులేని కాంగ్రెస్..కమిటీని మూడు ముక్కలు చేస్తారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పరిస్థితిపై హైకమాండ్ సంతృప్తిగా లేదు. నాయకులను మార్చడమా..? లేదంటే గ్రేటర్నే సంస్థాగతంగా విభజించడమా అనేది చర్చకు పెడుతోందట.
గ్రేటర్ హైదరాబాద్ కమిటీని ఇలాగే కొనసాగించాలని అంజన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నట్టే పార్టీ ఉంటే.. ఒప్పుకొనేది లేదని చెబుతోంది AICC. ఆఖరికి గ్రేటర్ హైదరాబాద్ను సంస్థాగత కమిటీల పరంగా మూడు ముక్కలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ కమిటీని సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్గా మూడు ముక్కలు చేస్తారని టాక్. ఈ మూడు ముక్కలకు కూడా కాంగ్రెస్లో పోటీ నెలకొంది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
సైబరాబాద్ పరిధిలోకి పాత రంగారెడ్డి జిల్లా వస్తుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించే అవకాశము ఉందట. ఇక్కడ డీసీసీ పగ్గాలు చేపట్టడానికి పార్టీ నేతలు మధుసూదన్రెడ్డి, రోహిన్రెడ్డి పోటీ పడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరు రేవంత్కు సన్నిహితంగా ఉంటారు. సికింద్రాబాద్ పరిధిలో పార్టీ పోస్ట్ కోసం నేతలు అడం సంతోష్, పార్టీ సోషల్ మీడియా విభాగం చూస్తున్న దీపక్ జాన్ రేస్లో ఉన్నారట. నాంపల్లి ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్ సైతం పగ్గాలు అప్పగించాలని లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే హైదరాబాద్ ఏరియా విషయంలో పార్టీ ఫిరోజ్ఖాన్ వైపు ఆసక్తి చూపిస్తోందట. కాంగ్రెస్ మైనారిటీ విభాగానికి చెందిన సోహెల్, మరో నేత వెంకటేష్ ముదిరాజ్లు తమ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
గ్రేటర్ కమిటీ విషయంలో పార్టీ నిర్ణయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. నాయకులు మాత్రం ఇప్పటి నుంచే పదవుల కోసం పోటీ పడటం విచిత్రం. రాహుల్ పర్యటన తర్వాత దీనిపై పార్టీలో పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. కమిటీని మూడు ముక్కలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న అంజన్ తన పంతం నెగ్గించుకుంటారో లేక.. పీసీసీ అనుకున్నదే అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!