Bhuma Akhilapriya: భూమా ఫ్యామిలీలో కొత్త టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటే. ఇప్పుడు సీన్ మారినట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధులు చేసే విమర్శలను సొంత ఫ్యామిలీయే చేస్తుండటంతో.. భూమా కుటుంబంలో చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీలో ఉంటున్న ఆ నేత టీడీపీ సీటుకు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. అందుకే సొంత ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు టాక్.
భూమా అఖిల వర్సెస్ భూమా కిశోర్రెడ్డి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొన్నటిదాకా రోడ్ల విస్తరణలో అవినీతి జరిగిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్లో అఖిలతోపాటు ఆమె భర్త భార్గవ్, తమ్ముడు విఖ్యాత్రెడ్డిపై కేసులు నమోదు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అఖిల వ్యక్తిగత సహాయకుడు అశోక్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. మాజీ మంత్రి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు వెళ్లడం చర్చగా మారాయి. తాజాగా ఈ రగడలో భూమా నాగిరెడ్డి సోదరుడు భాస్కర్రెడ్డి కుమారుడు, బీజేపీ నేత భూమా కిశోర్రెడ్డి ఎంటర్ అయ్యారు. భూమా అఖిల, ఆమె భర్త భార్గవ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read
టీడీపీ సీటు కొట్టేయాలనేది కిశోర్ ఆలోచనా?
బీజేపీలో ఉన్న కిశోర్రెడ్డి టీడీపీ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకే అఖిలను ఆమె భర్తను టార్గెట్ చేశారట. అంతేకాదు టీడీపీ నుంచి వాళ్లను బయటకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో కేసులతో చికాకుల్లో ఉన్న అఖిల ప్రియను పార్టీ సాగనంపితే ఆ సీటు కొట్టేయాలని కిశోర్ చూస్తున్నారట. అందుకే సొంత ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నారట.
స్థలం వివాదంలో భూమా కుటుంబసభ్యులు కేసులు
భూమా అఖిలప్రియ, భూమా కిశోర్రెడ్డి మధ్య స్థల వివాదం ఉంది. కిశోర్ స్థలం ప్రహారీ గోడను అఖిల అనుచరులు కూలగొట్టారు. దీంతో అఖిల ఆమె భర్త భార్గవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కిశోర్. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారాయన. అఖిల భర్త ఆళ్లగడ్డలో మరో నయిమ్లా తయారైయ్యారని ఆయన ఆరోపించారు. ఇలాగే కొనసాగితే ఆళ్లగడ్డలో ఎవరూ వ్యాపారాలు చేయలేరని .. టీడీపీలో వాళ్లను ఎలా కొనసాగిస్తున్నారో తెలియడం లేదని.. ప్రజలను హింసిస్తున్నట్టు పార్టీకి తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించారు కిశోర్. తక్షణమే అఖిల, భార్గవ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమా ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఘర్షణ వాతావరణం రావడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
తానే టీడీపీ అభ్యర్థి అని కిశోర్ ఓపెన్గా చెప్పింది లేదు
కిశోర్రెడ్డి ఆరోపణలతో ఒక్కసారిగా సీన్ మారింది. భూమా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఊరుకుంటే బుక్ అవుతామనుకున్నో ఏమో.. భూమా విఖ్యాత్రెడ్డి ఘాటుగానే విమర్శలకు దిగారు. బీజేపీలో ఉంటూ ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అని కిశోర్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు విఖ్యాత్రెడ్డి. ఇంట్లో మహిళకే గౌరవం ఇవ్వలేని ఆయన.. ఆళ్లగడ్డలో మహిళలకు ఏం గౌరవం ఇస్తారని కిశోర్రెడ్డిపై ఫైర్ అయ్యారు. అయితే తానే టీడీపీ అభ్యర్థినని కిశోర్రెడ్డి ఓపెన్గా చెప్పిన దాఖలాలు లేవు. ఆళ్లగడ్డలో మాత్రం ఆ ప్రచారం ఓ రేంజ్లో ఉంది. కారణం ఏదైనా భూమా కుటుంబంలో రచ్చ కావడం పెద్ద చర్చగా మారింది.
తాజావార్తలు
-
Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!