Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Pamban Bridge Explained Detailed In Telugu

Pamban Bridge: రాముడి సేతు నుంచి మోదీ పంబన్ వరకూ..!

Published Date :April 7, 2025 , 3:46 pm
By CLN Raju
Pamban Bridge: రాముడి సేతు నుంచి మోదీ పంబన్ వరకూ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. అంతేకాక.. భారత రైల్వే శాఖ ఇంజినీరింగ్ నైపుణ్యతకు ఇది నిదర్శనం. 2కిలో మీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన, రామాయణంలో పేర్కొన్న రామసేతుతో చారిత్రక, సాంస్కృతిక సంబంధం కలిగి ఉందని భావిస్తారు.

ఆధునిక పంబన్ వంతెన కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు.. రామాయణ కాలంలో శ్రీరాముడు వానర సైన్యంతో నిర్మించిన రామసేతు నుంచి ఆధునిక భారతదేశం వరకూ సాగిన చారిత్రక పరిణామాలకు సంకేతం. శ్రీరామ నవమి సందర్భంగా హనుమాన్ చాలీసా, వేదమంత్రోచ్ఛారణల మధ్య కొత్త పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిపై మొదటి రామేశ్వరం- తాంబరం ఎక్స్ ప్రెస్ కు మోదీ పచ్చజెండా ఊపారు. పాత పంబన్ వంతెన శిథిలమవడంతో, భారత రైల్వే శాఖ.. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఆధ్వర్యంలో కొత్త పంబన్ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. 2019లో 535 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2025లో పూర్తయింది.

ఈ వంతెన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా గుర్తింపు పొందింది. 72.5 మీటర్ల పొడవైన దాని మధ్య భాగం 17 మీటర్ల ఎత్తుకు ఎత్తబడుతుంది. దీనివల్ల ఎలాంటి నౌకలైనా సులభంగా దాటవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్‌లతో నిర్మితమైన ఈ వంతెన, తుప్పు నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక పూతతో రూపొందించబడింది. దీని జీవితకాలం సుమారు 58 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వందేళ్ల వరకూ సేవలందించగలదనే నమ్మకం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, డబుల్ రైలు ట్రాక్‌లను ఏర్పాటు చేసే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఈ వంతెన వల్ల రామేశ్వరం నుంచి చెన్నైకి ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గింది. కొత్త వంతెన వల్ల 2026 నాటికి 15శాతం పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

Trivikram: బన్నీ కాదు.. ఆ స్టార్ హీరోతో సినిమా సెట్ చేసే పనిలో త్రివిక్రమ్

కొత్త వంతెన సంగతి పక్కన పెడితే పాత పంబన్ వంతెన అనేక రికార్డులు సృష్టించింది. 19వ శతాబ్దంలో భారతదేశం, శ్రీలంక మధ్య రవాణా సౌలభ్యం కోసం రామసేతు సమీపంలో ఒక వంతెన నిర్మించాలని బ్రిటీషోళ్లకు ఆలోచన వచ్చింది. అయితే, రామసేతు భౌగోళిక స్వభావం కారణంగా దానిపై నేరుగా వంతెన నిర్మించడం సాధ్యం కాలేదు. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపేందుకు 1914లో మొట్టమొదటి పంబన్ వంతెన నిర్మించారు. ఈ వంతెనను బ్రిటిష్ ఇంజనీర్‌లు రూపొందించారు. రైలు రవాణాకు ఇది కీలక మార్గంగా మారింది. పాత పంబన్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో, సముద్రంపై నిర్మితమైన భారతదేశంలోని మొట్టమొదటి రైలు వంతెనగా చరిత్రలో నిలిచింది. దీన్ని ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా భావించేవారు. దీని మధ్య భాగంలో ఒక డబుల్-లీఫ్ బాస్క్యూల్ విభాగం ఉండేది. ఇది నౌకలు దాటడానికి వీలుగా పైకి ఎత్తబడేది. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు, వాణిజ్య రవాణాకు ఒక వరంగా మారింది. 1964 డిసెంబర్ 22న వచ్చిన సునామీ ధాటికి ధనుష్కోడి పట్టణం పూర్తిగా నాశనమైంది. పంబన్ వంతెనపై ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు సముద్రంలో కొట్టుకుపోవడంతో 115 మంది మరణించారు. 6 నెలల్లో వంతెనను పునర్నిర్మించి 1965లో తిరిగి ప్రారంభించారు. 104 సంవత్సరాల పాటు సేవలందించిన ఈ వంతెన, సముద్ర వాతావరణం కారణంగా తుప్పు పట్టడం, శిథిలావస్థకు చేరడంతో 2022లో మూసివేశారు.

రామాయణ కాలంలో రామసేతుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు పంబన్ వంతెన కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనికి ఎంతో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. భారతదేశంలోని రామేశ్వరం ద్వీపాన్ని శ్రీలంకలోని మన్నార్ ద్వీపంతో కలిపే సున్నపురాయి ఇసుక దిబ్బల శ్రేణే రామసేతు. రామాయణం ప్రకారం, ఈ వంతెనను శ్రీరాముడు తన భార్య సీతను రావణుడి నుంచి విడిపించేందుకు వానర సైన్యంతో నిర్మించాడు. వాల్మీకి రామాయణంలో వర్ణించిన ప్రకారం, ఈ వంతెన చెట్ల కాండాలు, రాళ్లతో నిర్మితమై, సముద్రంపై ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించింది. ఈ కథనం హిందూ సంస్కృతిలో లోతైన నమ్మకంగా రూపొంది, రామసేతును ఒక పవిత్ర స్థలంగా మార్చింది. భౌగోళికంగా రామసేతు సుమారు 30 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. సముద్రంలో కొన్ని చోట్ల కేవలం 1-2 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. దీంతో ఇది నౌకాయానానికి అనువుకాదని భావించారు. శాస్త్రవేత్తలు ఈ ఇసుక దిబ్బలు సహజంగా ఏర్పడినవని, సుమారు లక్ష 25వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు తగ్గినప్పుడు ఆవిర్భవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, హిందూ భక్తులు దీనిని శ్రీరాముడి దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు.

రామసేతు చారిత్రక ప్రస్తావనలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో ఎంతో మంది రచయితలు ఈ వంతెన గురించి తమ రచనల్లో పేర్కొన్నారు. 9వ శతాబ్దంలో ఓ అరబ్ రచయిత దీన్ని “సెట్ బంధాయ్” అంటే సముద్ర వంతెన అని పేర్కొన్నాడు. 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అల్-బిరూనీ దీనిని “ఆడమ్స్ బ్రిడ్జ్”గా సూచించాడు. ఇస్లామిక్ సంప్రదాయంలో ఆడమ్ అంటే ఆదాము ఈ ప్రాంతం గుండా శ్రీలంకకు వెళ్లాడని నమ్ముతారు. ఇలా రామసేతు వివిధ సంస్కృతులలో విభిన్న పేర్లతో విభిన్న కథనాలతో ప్రసిద్ధి చెందింది. మధ్యయుగంలో, రామసేతు సమీపంలోని రామేశ్వరం ఒక పవిత్ర తీర్థస్థలంగా అభివృద్ధి చెందింది. రామనాథస్వామి ఆలయం ఇక్కడ స్థాపించబడి, భక్తులను ఆకర్షించడం ప్రారంభించింది. అయితే, రామసేతు సముద్రంలో ఎక్కువగా మునిగిపోవడం, దాని పైన నడవడం లేదా ప్రయాణించడం అసాధ్యం కావడంతో, ఇది కేవలం పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మాత్రమే కలిగి ఉండేది.

కొత్త పంబన్ వంతెన నిర్మాణం కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు. రామసేతుతో జనం గుండెల్లో చెరిగిపోయిన సాంస్కృతిక భావనకు ఆధునిక రూపం. రామాయణంలో వర్ణించిన రామసేతు ఒక దైవిక నిర్మాణంగా భావించబడితే, నేటి పంబన్ వంతెన భారతీయ ఇంజనీరింగ్ శక్తికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉందని చాలా మంది భక్తులు నమ్ముతారు. రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి రామసేతు ప్రారంభమైనట్లు రామాయణం చెబుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికీ యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా ఉంది. పంబన్ వంతెన రామసేతుకు సమాంతరంగా నిర్మితమైనప్పటికీ, దీని ఉనికి ఆ పౌరాణిక కథనానికి ఒక ఆధునిక సాక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఈ వంతెనను శ్రీరామ నవమి రోజున ప్రారంభించడం, రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం దీని సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేసింది.

రామసేతు నుంచి పంబన్ వంతెన వరకూ పరిణామం అనేక దశలను దాటింది. పౌరాణిక కాలంలో దైవిక నిర్మాణంగా, మధ్యయుగంలో ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రస్తుతం రవాణా మార్గంగా రూపాంతరం చెందింది.
21వ శతాబ్దంలో పంబన్ వంతెన భారతదేశ సాంకేతిక పురోగతికి ప్రతీకగా నిలుస్తోంది. రామేశ్వరం ప్రాంతంలో ఈ వంతెన పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో, రామసేతు చారిత్రక, సాంస్కృతిక విలువలను కాపాడుతూ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం ఒక సవాలుగా ఉంది. 2000లలో సేతు సముద్రం షిప్పింగ్ కాలువ ప్రాజెక్ట్ ప్రతిపాదన సందర్భంగా రామసేతును తవ్వడంపై వివాదం చెలరేగింది. అప్పుడు, భక్తులు, పర్యావరణవేత్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో, పంబన్ వంతెన నిర్మాణం ఒక మధ్యేమార్గ పరిష్కారంగా కనిపించింది.

కొత్త పంబన్ వంతెన రామసేతు పౌరాణిక గాథ నుంచి ఆధునిక భారతదేశ సాంకేతిక శక్తి వరకూ సాగిన ప్రయాణానికి ఒక అద్దం పడుతుంది. ఇది కేవలం రైలు రవాణా సౌలభ్యం మాత్రమే కాదు. భారత సంస్కృతి, చరిత్ర, ఆధునికతల సమ్మేళనం. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానికులకు కొత్త ఆశలను తీసుకొచ్చింది. రామసేతు పవిత్రతను కాపాడుతూ భవిష్యత్తు వైపు ఒక అడుగు వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • modi
  • Pamban Bridge

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions