IML 2025: ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ.. వీడియో వైరల్
- ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ
- అంపైర్, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా మాస్టర్స్- వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ జట్టు విజయం సాధించింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 ఫైనల్లో భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టినో బెస్ట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇండియా మాస్టర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా యువరాజ్, బెస్ట్ మధ్య గొడవ జరిగింది.
Also Read:Kalyan ram : ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నుండి పవర్ ఫుల్ టీజర్
Also Read
- Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
- Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
- CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
- Pawan Kalyan: తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు.. కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు!
బెస్ట్ తన ఓవర్ పూర్తి చేసిన తర్వాత గ్రౌండ్ వదిలి వెళ్లాలనుకున్నాడు. ఈ విషయం యువరాజ్ అంపైర్కు తెలియజేశాడు. దీంతో బెస్ట్ గ్రౌండ్ లోకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇదంతా టినో బెస్ట్ కి నచ్చలేదు. ఈ సంఘటన 13 ఓవర్ల తర్వాత జరిగింది. టినో బెస్ట్ తిరిగి మైదానంలోకి వచ్చిన వెంటనే యువరాజ్ వైపు వెళ్లి వాదించడంతో హీట్ పెరిగింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరికొకరు వేళ్లు చూపించుకుంటు గొడవపడ్డారు. పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు గమనించిన అంపైర్, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. అంబటి రాయుడు యువరాజ్ సింగ్ను విడదీస్తున్నట్లు కనిపించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన యూవీ ఫ్యాన్స్ యూవీ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read:Gold Rates Today: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను గెలుచుకుంది. రాయ్పూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో, బ్రియాన్ లారా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ 17.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 మొదటి ఎడిషన్ విజేత జట్టుగా అవతరించింది.
— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025
తాజావార్తలు
-
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
-
TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
-
Explainer: ఎల్నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Ban Social Media for Children Under 16: అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రధాని సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!