ఏపీలో పాదయాత్రల రాజకీయం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హాట్ కామెంట్స్ చేశారు. సాధారణంగా పాదయాత్రకు ముందు రూట్ మ్యాప్ అడగడం సహజం. లోకేష్ తన ఉనికిని కాపాడుకొవడానికి చేసే పాదయాత్ర ఇది అన్నారు. లోకేష్ పాదయాత్ర చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. పాదయాత్ర ఎవరైనా చేయొచ్చు. జగన్ పాదయత్రకి ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీకు తెలుసు. పాదయాత్ర చేసి ప్రజలు మన్ననలు పొందాలి అని ఉంటే నిబంధనలు పాటించండి.
Read Also: Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి
పవన్ కి చంద్రబాబు పార్టీ పగ్గాలు ఎక్కడ అప్పగిస్తారో అని లోకేష్ పాదయాత్ర చేస్తా అంటున్నారు. పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉంది. లోకేష్ ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నేత కాదు. లోకేష్ పాదయాత్రకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పాదయాత్రలో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత ఇస్తారు.?పోలీసులను అందరినీ గౌరవించాలి. లోకేష్ పాదయాత్ర కామెడీగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు తలశిల రఘురాం. మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రకు ప్రతిబంధకాలు కల్పిస్తే సహించేది లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.
Read Also:Rudrangi: మీరా బాయిగా విమలా రామన్! బర్త్ డే పోస్టర్ విడుదల!