Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. గూగుల్, అదానీ, ఎయిర్ టెల్ సంస్థలు డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్ అమలులో పలు అంశాలపై స్పష్టత లేదని అన్నారు.
ప్రభుత్వం డేటా సెంటర్ కోసం సుమారు రూ.22 వేల కోట్ల రాయితీలు ఇస్తున్నప్పటికీ, ఉద్యోగాల కల్పనపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. ప్రారంభంలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరిగినప్పటికీ, ఒప్పందంలో కేవలం 200 ఉద్యోగాలే ఉన్నాయని తెలిపారు. శంకుస్థాపన సందర్భంగా కూడా ఉద్యోగాలపై ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
అలాగే, గూగుల్తో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగాలపై కమిట్మెంట్ తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు. డేటా సెంటర్కు అవసరమైన నీటి, విద్యుత్ వనరులపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. గోదావరి నీటిని విశాఖకు రెండు నెలల్లో తీసుకురావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పైప్లైన్ కనెక్టివిటీ కూడా లేదని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించాలంటే ఎత్తు సమస్యలు ఉన్నాయని వివరించారు.
విద్యుత్ సరఫరా అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. డేటా సెంటర్కు అవసరమైన భారీ విద్యుత్ను ఎలా అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడానికి జగన్ హయాంలోనే పునాదులు పడ్డాయని పేర్కొన్న ఆయన, 2021లో సబ్సీ కేబుల్ కోసం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇంధన సరఫరాలో సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!