YSRCP vs TDP: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం వద్ద వైసీపీ నేతలతో ఎన్డీయే కూటమి నాయకులు వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఎంపీటీసీలతో కలిసి మాజీమంత్రి కారుమూరి మండల పరిషత్ కార్యలయానికి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగాలంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా, మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో వైసీపీకి 14 మంది ఎంపీటీసీలు ఉండగా టీడీపీ, జనసేన పార్టీలకు తలో రెండు ఎంపీటీసీలు ఉన్నారు.
YSRCP vs TDP: మాజీ మంత్రి కారుమూరి ఇంటి వద్ద వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం..
- పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత..
- మాజీ మంత్రి కారుమూరి ఇంటి వద్ద వైసీపీ, కూటమి నేతల మధ్య వాగ్వాదం..
- వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా అడ్డుకున్న టీడీపీ..
- ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాలంటూ వైసీపీ నేతలు నినాదాలు..

Ycp Vs Tdp