వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వైఎస్ షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వస్తుందని… ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
21 రోజులు 6 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందల సమస్యలు చూశామని… పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు,పలు రకాల ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపామని వెల్లడించారు. వరి కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పడం భావ్యమా ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రైతుల కోసం ఎన్నో చేస్తే ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని ఓ సర్వే చెప్పిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు వైఎస్ షర్మిల.
