YS Sharmila : మహాత్మాగాంధీ ఒక నిస్వార్థ పరుడు.. కేసీఅర్ ఒక స్వార్థ పరుడు, అవినీతి పరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మెదక్లోని శంకరంపేటలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మాదిరిగా మహాత్మగాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదన్నారు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు ఈరోజు మహాత్మతో పోల్చుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ అని, లక్షల మంది ఆస్తులు త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ..వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
అంతేకాకుండా.. కేసీఅర్ ఏమో నేనే తెచ్చాను అని చెప్పుకుంటున్నారని, కేసీఅర్ ఇంట్లో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు…? అని ఆమె ప్రశ్నించారు. గడ్డాలు పెంచారు..దొంగ దీక్షలు చేశారు..ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయారంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఒక నిస్వార్థ పరుడని, కేసీఅర్ ఒక స్వార్థ పరుడు ఒక అవినీతి పరుడంటూ ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!