NTV Telugu Site icon

YS Jagan: మరోసారి ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు జగన్.. తన పర్యటనలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనననున్నారు.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న జగన్.. ఉదయం 11.40కి విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు.. మధ్యాహ్నం 12.25కి కడప ఎయిర్‌పోర్టు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో గల తన స్వగృహానికి చేరుకుంటారు వైఎస్‌ జగన్‌.. ఈ మూడు రోజుల పాటు పులివెందుల, ఇడుపులపాయలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?