Jagan Mohan Reddy: వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
- 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం
- రేషన్ డెలివరీ వాహనాల నిలిపివేత
- లిక్కర్ స్కాంపై స్పందించే అవకాశం.
- సాయంత్రం బెంగుళూరుకు ప్రయాణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagan Mohan Reddy: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం రాజకీయంగా ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఏమి మాట్లాడతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక వైఎస్సార్సీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర ప్రజలకు కొన్ని కీలక సందేశాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేసిన విషయం, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం వంటి అంశాలపై జగన్ స్పందించే అవకాశముంది. ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్లుగా మారాయి.
Read Also: Cyber Crime: కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!
Also Read
ఇక మీడియా సమావేశం తర్వాత జగన్ ఈ రోజు సాయంత్రం బెంగుళూరుకు ప్రయాణించనున్నారు. సాయంత్రం 04.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయం నుంచి 05.40 గంటలకు బెంగుళూరుకు వెళ్లనున్నారు. రాత్రి 07.55 గంటలకు ఆయన బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ ప్రయాణం వ్యక్తిగతమా లేక రాజకీయ పరంగా ఏదైనా ఉద్దేశ్యమా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇకపోతే.. వైఎస్ జగన్ మీడియా సమావేశం, అనంతరం బెంగుళూరు పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది
Read Also: Hyderabad Rain: హైదరాబాద్లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..