YS Avinash Reddy: ఎందరు కలిసివచ్చినా జగన్ను టచ్ చేయలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Avinash Reddy: 2019లో ఏ విధంగా ఆదరించారో.. 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి.. సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలి అన్నారు కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి.. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో పులివెందుల ఎంతో అభివృద్ధి చెందింది.. నాలుగు సార్లు సీబీఆర్ కు ఫుల్ కెపాసిటీ నీటిని నింపారని తెలిపారు. చంద్రబాబు పులివెందులకు వచ్చి పోయిన తర్వాత వర్షం లేకుండా పోయిందన్న ఆయన.. ఈ 16 నెలల కరువు కాలంలో లింగాల, పీబీసీ కాలుల ద్వారా అరటి రైతులకు నీళ్లు ఇచ్చాం అని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకు జిల్లా యంత్రాంగానికి 750 కోట్ల రూపాయలు వ్యవసాయ భీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో 1900 కోట్లు పంటలు బీమా మంజూరు అయ్యిందన్నారు.
Read Also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
వైసీపీ అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు చేసేది లేక గుంపులు కట్టుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు అవినాష్ రెడ్డి. చంద్రబాబుతో పాటు, ప్యాకెట్ స్టార్, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ ఎందరు కలిసి వచ్చిన జగన్ ను టచ్ చేయలేరని స్పష్టం చేశారు. 2019లో వైసీపీని ఏ విధంగా ఆదరించారో 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి… సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలని కోరారు. ఇక, సీఎం వైఎస్ జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరన్నారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.. వాళ్ల ట్రాప్లో పడవద్దు అని విజ్ఞప్తి చేశారు కడప ఎంపీ, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..