Viral Video: రైలులో ఒంటరిగా మహిళా యూట్యూబర్ ప్రయాణం.. కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేశాడంటే..?
- రైలులో ఒంటరిగా ప్రయాణించిన యూట్యూబర్
- తాను ప్రయాణిస్తున్న కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి
- మత్తుమందు స్ప్రే చేసి విలువైన వస్తువుల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆ మహిళా యూట్యూబర్ పేరు కనికా దేవ్రానీ. బ్రహ్మపుత్ర మెయిల్లో ఢిల్లీ నుంచి అస్సాంకు ప్రయాణించింది. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నందున భద్రత కోసం 2ACని ఎంచుకుంది. ముందు జాగ్రత్తగా ఆమె తన ఫోన్ను దిండు కింద పెట్టుకుని.. తన బెర్త్ చుట్టూ కర్టెన్లను తీసి, నిద్రపోతుంది. అప్పుడే.. గుర్తు తెలియని వ్యక్తి టికెట్ లేకుండా 2AC కోచ్లోకి ప్రవేశించాడు. సీట్ల సంఖ్యల గురించి ఆరా తీశాడు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులపై మత్తుమందు స్ప్రే చేశాడు. వాళ్లు మత్తులోకి జారుకోగానే.. విలువైన వస్తువులను దొంగిలించాడు. ఈ అంశంపై తాను ఎంత ప్రయత్నించినా, రైల్వే పోలీసుల నుంచి తనకు పెద్దగా సహాయం అందలేదని ఆ యువతి పేర్కొంది. అస్సాం పోలీసుల నుంచి కూడా మద్దతు రాలేదని వీడియోలో వెల్లడించింది.
READ MORE: Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
యూట్యూబర్ కనికా దేవ్రానీ తన వీడియోలో భారతీయ రైళ్లలో భద్రత లేకపోవడాన్ని పదే పదే నొక్కి చెప్పారు. “సురక్షితంగా ప్రయాణించండి” అని ప్రేక్షకులను కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తించింది. ఆమె వీడియో 44 వేలకు పైగా లైక్లు, దాదాపు 860 వ్యాఖ్యలతో వైరల్ అయింది. రైల్వేలో భద్రతా లోపం, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన లోపాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. భారత రైల్వేలు త్వరిత చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!