Viral Video: రైలులో ఒంటరిగా మహిళా యూట్యూబర్ ప్రయాణం.. కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేశాడంటే..?
- రైలులో ఒంటరిగా ప్రయాణించిన యూట్యూబర్
- తాను ప్రయాణిస్తున్న కోచ్లోకి ప్రవేశించిన వ్యక్తి
- మత్తుమందు స్ప్రే చేసి విలువైన వస్తువుల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళా యూట్యూబర్ రైలులో ఒంటరిగా ప్రయాణించింది. ఓ వ్యక్తి తన కోచ్లోకి వచ్చి మత్తుమందు స్ప్రే చేశాడని తెలిపింది. అనంతరం తనతో పాటు చాలా మంది వస్తువులు దోచుకున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసిన రైల్వే ప్రయాణికులకు భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్..!
Also Read
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
ఆ మహిళా యూట్యూబర్ పేరు కనికా దేవ్రానీ. బ్రహ్మపుత్ర మెయిల్లో ఢిల్లీ నుంచి అస్సాంకు ప్రయాణించింది. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తున్నందున భద్రత కోసం 2ACని ఎంచుకుంది. ముందు జాగ్రత్తగా ఆమె తన ఫోన్ను దిండు కింద పెట్టుకుని.. తన బెర్త్ చుట్టూ కర్టెన్లను తీసి, నిద్రపోతుంది. అప్పుడే.. గుర్తు తెలియని వ్యక్తి టికెట్ లేకుండా 2AC కోచ్లోకి ప్రవేశించాడు. సీట్ల సంఖ్యల గురించి ఆరా తీశాడు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులపై మత్తుమందు స్ప్రే చేశాడు. వాళ్లు మత్తులోకి జారుకోగానే.. విలువైన వస్తువులను దొంగిలించాడు. ఈ అంశంపై తాను ఎంత ప్రయత్నించినా, రైల్వే పోలీసుల నుంచి తనకు పెద్దగా సహాయం అందలేదని ఆ యువతి పేర్కొంది. అస్సాం పోలీసుల నుంచి కూడా మద్దతు రాలేదని వీడియోలో వెల్లడించింది.
READ MORE: Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
యూట్యూబర్ కనికా దేవ్రానీ తన వీడియోలో భారతీయ రైళ్లలో భద్రత లేకపోవడాన్ని పదే పదే నొక్కి చెప్పారు. “సురక్షితంగా ప్రయాణించండి” అని ప్రేక్షకులను కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తించింది. ఆమె వీడియో 44 వేలకు పైగా లైక్లు, దాదాపు 860 వ్యాఖ్యలతో వైరల్ అయింది. రైల్వేలో భద్రతా లోపం, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించిన లోపాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. భారత రైల్వేలు త్వరిత చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!