MS Dhoni-Sakshi: నీకు ఏమీ తెలియదు అంటూ.. ధోనీకే క్రికెట్ రూల్స్ నేర్పించిన సాక్షి!
- లెజెండరీకే రూల్స్ నేర్పించిన సాక్షి
- 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు
- ఐపీఎల్ 2025లో ధోనీ ఆడే అవకాశాలు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ కూడా. అంతేకాదు భారత్కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత అతడి సొంతం. అలాంటి లెజెండరీ ధోనీకే ఆయన సతీమణి సాక్షి క్రికెట్ రూల్స్ నేర్పించారట. ఈ విషయాన్ని స్వయంగా మహీనే వెల్లడించారు.
‘ఓరోజు నేను, సాక్షి ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. మేం టీవీ చూస్తున్నపుడు క్రికెట్ గురించి మాట్లాడుకోము. ఆ రోజు మ్యాచ్లో బౌలర్ వైడ్ బాల్ వేశాడు. బ్యాటర్ షాట్ ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు రాగా.. కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. సాక్షి మాత్రం బ్యాటర్ అవుట్ కాదంది. అప్పటికే బ్యాటర్ పెవిలియన్కు వెళ్లిపోతున్నాడు. అయినా కూడా అంపైర్లు అతడిని వెనక్కి పిలుస్తారని, వైడ్ బాల్కు స్టంపౌట్ ఎలా ఇస్తారని నాతో వాదించింది. వైడ్ బాల్కి స్టంపౌట్ చేయొచ్చని, నో బాల్ వేసినపుడు మాత్రమే బ్యాటర్ స్టంపౌట్ కాడని సాక్షికి చెప్పాను’ అని ఎంఎస్ ధోనీ తెలిపాడు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
Also Read: IND vs NZ: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు స్టార్ బ్యాటర్ దూరం?
‘నేను ఎంత చెప్పినా సరే సాక్షి వినలేదు. నీకు క్రికెట్ గురించి ఏమీ తెలియదు, ఊరుకో అంటూ నాపై చిందులేసింది. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత బ్యాటర్ వెనక్కి వస్తాడు అని అంటూనే ఉంది. అప్పటికే ఆ బ్యాటర్ బౌండరీ లైన్ దాటి వెళ్లిపోయాడు. కొత్త బ్యాటర్ కూడా క్రీజులోకి వచ్చాడు. ఏదో తప్పు జరిగింది అంటూ సాక్షి తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు. 2010లో ధోనీ, సాక్షిల వివాహం జరగగా.. వీరికి జీవా అనే కూతురు ఉంది. 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. ఐపీఎల్ 2025లో మహీ ఆడే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?