Municipal Corporation Kadapa: కడపలో ఫ్లెక్సీ వార్.. ‘హూ ఈజ్ జయశ్రీ’ అంటూ ఫ్లెక్సీలు!
- మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
- కడప నగరంలో ఫ్లెక్సీ వార్
- కార్పొరేషన్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో కుర్చీ వివాదంపై కడప నగరం మొత్తంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా, జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పోరేషన్ కార్యాలయం దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడప నగర మేయర్ సురేష్ బాబు సతీమణి ఈ జయశ్రీ.
మున్సిపల్ సర్వసభ్య సమావేశ వేదికపై మేయర్కు మాత్రమే కుర్చీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాధవికి వేదికపై సీటు కేటాయించకపోతే.. ఆందోళన చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. మరికాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆరంభం కానుంది. గత నెల రోజులుగా మున్సిపల్ సమావేశంలో వేదికపై కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోన్న నేపథ్యంలో నేడు జరిగే సమావేశంలో గందరగోళ పరిస్థితులు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సభలను పోలీసులు నిషేధించారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కడప కార్పొరేషన్లోకి ఉద్యోగులను, మీడియాను అనుమతిస్తున్నారు.
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
Also Read: Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని నేడు మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్నారు. సమావేశానికి భారీ బందోబస్తు కావాలంటూ పోలీసులను మున్సిపల్ మేయర్ సురేష్ బాబు కోరారు. సమావేశంలోకి కార్పొరేటర్లను మాత్రమే అనుమతించేలా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన నేపథ్యంలో సమావేశం రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ వద్ద ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురవకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..