Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2012లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన 56 ఏళ్ల మహిళకు కుడి కిడ్నీలో సమస్య (హైడ్రోనెఫ్రోసిస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 6, 2012న ఆశీర్వాద్ నర్సింగ్ హోమ్లో డాక్టర్ రాజీవ్ లోచన్ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, వ్యాధి ఉన్న కుడి కిడ్నీని తొలగించడానికి బదులుగా, ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని డాక్టర్ పొరపాటున తొలగించారు. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తగ్గకపోవడంతో వేరే ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించగా, తప్పుడు కిడ్నీని తొలగించినట్లు తేలింది. అప్పటినుంచి ఆమెను డయాలసిస్పై ఉంచారు. ఆరోగ్యం క్షీణించి, తీవ్రమైన హైపర్కలేమియా (రక్తంలో పొటాషియం పెరగడం), హైపోగ్లైసీమియా (షుగర్ లెవెల్స్ పడిపోవడం) కారణంగా ఆమె 2014లో మరణించారు.
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చార్జ్షీట్ దాఖలైంది. దీనిపై డాక్టర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఉత్తరప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆ డాక్టర్ రిజిస్ట్రేషన్ను రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. మహిళ మరణానంతరం ఆమె కుటుంబం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించింది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
జస్టిస్ (రిటైర్డ్) ఎపి సాహి నేతృత్వంలోని ఎన్సిడిఆర్సి బెంచ్ దీనిని “అత్యంత తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం”గా అభివర్ణించింది. ఎడమ కిడ్నీ సురక్షితంగా ఉండి ఉంటే ఆమె మరికొంత కాలం బతికేదని పేర్కొంది. ఒక కుటుంబానికి తల్లిగా, భార్యగా ఆమె కోల్పోయిన స్థానాన్ని భర్తీ చేయలేమని స్పష్టం చేస్తూ, బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని మే 18న సంచలన తీర్పునిచ్చింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!