Ayodya Temple: అయోధ్య ఆలయంలో రాముడి నూతన విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodya Temple: అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. 70 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర తీసిన రామ్ లల్లా విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్టించబోమని ఆయన చెప్పారు. దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు, డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదును కూల్చివేసిన అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆగస్ట్ 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రఖ్యాత శిల్పులు విగ్రహాన్ని రూపొందించే బాధ్యత తీసుకుంటారని వెల్లడించారు. విగ్రహం తయారీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రాతిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకేలా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వీరు సూచనలు చేస్తారని వివరించారు. గర్భగుడిలో 9 అడుగుల ఎత్తులో, ఉదయించే సూర్యుని కిరణాలు శ్రీరాముడి నుదుటిపైకి తాకే కోణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు.
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
Gopichand Malineni : నేను పుట్టిన గడ్డమీద.. నాకు నచ్చిన హీరోతో.. జీవితానికి ఇది చాలు
అయితే కచ్చితమైన రూపురేఖలు, ఎక్స్ ప్రెషన్స్, ముఖంపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన శిల్పులు సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కెకెవి మానియా, పుణేకు చెందిన శత్రయజ్ఞ దేవల్కర్లను తుది ఎంపిక కోసం విగ్రహాల డ్రాఫ్ట్ను పంపాల్సిందిగా కోరారు. జనవరి 1, 2024 నాటికి అయోధ్యలో రామమందిరాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు. ప్రణాళిక ప్రకారం, 2024 లో మకర సంక్రాంతి (జనవరి 14) నాడు ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. 2023 చివరి నాటికి గర్భగుడి వద్ద నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?