Ayodya Temple: అయోధ్య ఆలయంలో రాముడి నూతన విగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodya Temple: అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. 70 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెర తీసిన రామ్ లల్లా విగ్రహాన్ని కొత్త ఆలయంలో ప్రతిష్టించబోమని ఆయన చెప్పారు. దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు, డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదును కూల్చివేసిన అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఆగస్ట్ 5, 2020న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రఖ్యాత శిల్పులు విగ్రహాన్ని రూపొందించే బాధ్యత తీసుకుంటారని వెల్లడించారు. విగ్రహం తయారీకి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రాతిని ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకేలా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వీరు సూచనలు చేస్తారని వివరించారు. గర్భగుడిలో 9 అడుగుల ఎత్తులో, ఉదయించే సూర్యుని కిరణాలు శ్రీరాముడి నుదుటిపైకి తాకే కోణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు.
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
Gopichand Malineni : నేను పుట్టిన గడ్డమీద.. నాకు నచ్చిన హీరోతో.. జీవితానికి ఇది చాలు
అయితే కచ్చితమైన రూపురేఖలు, ఎక్స్ ప్రెషన్స్, ముఖంపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాకు చెందిన శిల్పులు సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కెకెవి మానియా, పుణేకు చెందిన శత్రయజ్ఞ దేవల్కర్లను తుది ఎంపిక కోసం విగ్రహాల డ్రాఫ్ట్ను పంపాల్సిందిగా కోరారు. జనవరి 1, 2024 నాటికి అయోధ్యలో రామమందిరాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు. ప్రణాళిక ప్రకారం, 2024 లో మకర సంక్రాంతి (జనవరి 14) నాడు ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. 2023 చివరి నాటికి గర్భగుడి వద్ద నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!