Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లపై సీఈసీ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జమ్మూకాశ్మీర్లో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏప్రిల్ 12, 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి సమర్పించాలని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది.
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సకాలంలోనే వివరాలను ఎస్బీఐ అందించిందని సీఈసీ తెలిపారు. అలాగే వివరాలను పరిశీలిస్తున్నామని.. సకాలంలోనే ఆ వివరాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో రాబోయే లోక్సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు సీఈవో రాజీవ్ కుమార్ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఇక లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని సీఈసీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లంతా పండుగలా.. ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనవలసిందిగా రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇక తప్పుడు వార్తలపై స్పందించేందుకు అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా సెల్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పిస్తున్నామని.. కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఆన్లైన్ నగదు బదిలీలపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారు.
గత ఆరేళ్ల నుంచి జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదు. అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోవైపు జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆల్పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!