Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లపై సీఈసీ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జమ్మూకాశ్మీర్లో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏప్రిల్ 12, 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి సమర్పించాలని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది.
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సకాలంలోనే వివరాలను ఎస్బీఐ అందించిందని సీఈసీ తెలిపారు. అలాగే వివరాలను పరిశీలిస్తున్నామని.. సకాలంలోనే ఆ వివరాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
జమ్మూ కాశ్మీర్లో రాబోయే లోక్సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు సీఈవో రాజీవ్ కుమార్ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఇక లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని సీఈసీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లంతా పండుగలా.. ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనవలసిందిగా రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఇక తప్పుడు వార్తలపై స్పందించేందుకు అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా సెల్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పిస్తున్నామని.. కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఆన్లైన్ నగదు బదిలీలపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఆయన చెప్పారు.
గత ఆరేళ్ల నుంచి జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదు. అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోవైపు జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆల్పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?