Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Why Maldives Presidential Election Could Be Key For China India Rivalry

Maldives: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎందుకంత కీలకం..

Published Date :September 6, 2023 , 12:59 pm
By Venu Goapl Reddy
Maldives: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎందుకంత కీలకం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు. ఈ చిన్న దేశం ఇప్పుడు ఆసియా శక్తులుగా ఉన్న ఇండియా, చైనాలకు కీలకంగా మారింది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా, చైనాలు పోటీ పడుతున్నాయా.? అనే విధంగా అక్కడి పరిస్థితి ఉంది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు ఈ రెండు దేశాలకు కీలకంగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం భారత్ పక్షాన ఉంది. ఈ ప్రాంత భౌగోళిక స్థితి రెండు దేశాలకు కీలకంగా మారింది.

5,21,000 మంది ప్రజలు ఉంటే అనేక ద్వీపాలతో ఏర్పడిన ఈ దేశం ఆర్థిక వ్యవస్థ మేజర్ గా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశంలో మౌళిక సదుపాయాలను డెవలప్ చేయడానికి ఇటు భారత్, అటు చైనాలు పోటీ పడుతున్నాయి. మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం మొహమ్మద్ ‘‘ఇండియా ఫస్ట్’’ నినాదాన్ని అనుసరిస్తూ.. భారత్ వైపు ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా సోలిహ్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

సోలిహ్ కు పోటీగా మొహమ్మద్ మయిజ్జూ ఉన్నారు. ఇతని సంకీర్ణానికి చైనా సన్నిహితంగా ఉంది. ‘ఇండియా ఔట్’ అనే నినాదంలో ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విమానాలు, భారత సైనిక ఉనికిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. 2,80,000 ఓటర్లు ఉన్నారు. గత నెలలో బానీ సెంటర్ థింక్ ట్యాంక్ నిర్వహించిన సర్వేలో 21 శాతం మంది సోలిహ్ వైపు మొగ్గు చూపగా.. 14 శాతం మంది మయిజ్జూ వైపు ఉన్నరాు. 53 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Read Also: YV Subba Reddy: ‘జమిలి’యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!

సోలిహ్‌ వైపే ప్రజలు:

2018లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా సోలిహ్ ఘన విజయం సాధించారు. అయితే 2021లో ప్రొగ్రెసివ్ పార్టీ, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న మయిజ్జూ, రాజధాని మాలే మేయర్ పదవిని గెలుచుకుని అందర్ని ఆశ్చర్యపరిచారు. ఇది సోలిహ్ పార్టీ మాల్డీవియన్ డెమోక్రాటిక్ పార్టీకి బలమైన కోటగా ఉంది.

భారత్ విషయానికి వస్తే హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తుంది. కొన్ని శతాబ్ధాలుగా మాల్దీవులకు, ఇండియాకు సాంస్కృతిక, సన్నిహిత, భద్రతా సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో చైనా అక్కడి ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులను పెట్టింది. బెల్ట్ అండ్ రోడ్ ప్లాన్ లో భాగంగా ఇంధనం, రవాణఫా నెట్వర్కుల్లో పెట్టుబడులు పెడుతోంది చైనా.

సోలిహ్ భారతదేశాన్ని సంక్షోభ సమయాన్ని మొదటగా స్పందించే దేశంగా పేర్కొన్నారు. తమకు మద్దతు ఇచ్చే దేశంగా అభివర్ణించారు. మయిజ్జూ మాత్రం అధికారంలోకి వస్తే భారత్ ప్రభావాన్ని తగ్గిస్తానని, భారత్ మాల్దీవుల సార్వభౌమాధికారానికి ముప్పు కలిగిస్తుందని, శాశ్వత మిలిటరీ బేస్ ఏర్పాటు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఆరోపణల్ని భారత్ ఖండించింది. మాల్దీవు దళాల కోసం నావికా నౌకాశ్రయాన్ని నిర్మించడానికి సాయం చేస్తున్నామని, భారత్ వారికి శిక్షణ ఇస్తోందని చెబుతోంది. మరోవైపు చైనా మాల్దీవుల్లో పాగా వేసి ఇండియా కార్యకలాపాలపై నిఘా పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో హంబన్ టోట పోర్టును లీజుకు తీసుకుంది. అక్కడి నుంచి భారత్ పై నిఘా పెడుతోంది. ఈ విషయంపై పలుమార్లు భారత్ తన అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • india
  • Indian Ocean
  • Maldives
  • Maldives Presidential Election

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions