Site icon NTV Telugu

Rahul Gandhi: సుశీల్ మోడీ రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం కేసు పరిస్థితేంటి?

Rahul

Rahul

రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. కాగా, 2019 ఏప్రిల్‌ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. తరువాత అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటును తొలగించింది.

READ MORE: Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?

ఇదిలా ఉండగా.. బీహార్ బీజేపీ నాయకుడు, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ కూడా గతేడాది రాహుల్ గాంధీపై ‘మోడీ ఇంటిపేరు’ కేసు పెట్టారు. ఆయనపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో, రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పాట్నా హైకోర్టు ఇక్కడ ట్రయల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసింది. సుశీల్ మోడీ కేసులో పాట్నా హైకోర్టు ఈ ఏడాది మే 15 వరకు స్టే విధించింది. సుశీల్ మోడీ మృతితో రాహుల్ పై ఆయన కేసు ఏమవుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుశీల్ మోడీ వారసులు కేసును కొనసాగించాలంటే చట్టపరంగా అవకాశం ఉంటుందని పలువురు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఫిర్యాదుదారు చనిపోతే పరువు నష్టం కేసు సాధారణంగా ముగియదు. ఫిర్యాదుదారు ప్రతినిధి, కుటుంబ సభ్యుల స్థానంలో చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు. ఫిర్యాదుదారుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకుంటే.. కోర్టు కేసును కొట్టివేయవచ్చు.

Exit mobile version