Govinda: క్రిప్టో-పోంజీ స్కామ్లో 2 లక్షల మంది మోసం.. రూ.1000కోట్లు ‘గోవిందా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రూ. 1000 కోట్ల విలువైన ఆన్లైన్ పోంజీ స్కామ్లో చిక్కుకున్నాడు. దీని కారణంగా ఇప్పుడు ఈవోడబ్ల్యూ గోవిందను త్వరలో విచారించనుంది. ఈ వెయ్యి కోట్ల కుంభకోణంలో 2 లక్షల మందిని మోసం చేశారు. ఈ వెయ్యి కోట్ల రూపాయల పోంజీ స్కామ్ లో దాదాపు 2లక్షల మంది ఎలా మోసపోయారన్నది.. ప్రజల మదిలో మెదలాడే ప్రశ్న. ఈ స్కామ్ తో గోవింద ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం. నిజానికి రూ.వెయ్యి కోట్ల కుంభకోణం ఆన్లైన్ క్రిప్టోకు సంబంధించినది. ఈ స్కామ్ ద్వారా చేసిన పథకం పేరు పోంజీ. సోలార్ టెక్నో అలయన్స్ కంపెనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుండి లక్షల మంది పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలను క్రిప్టోలో డిపాజిట్ చేసింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ప్రజల నుంచి రూ.1000 కోట్ల డిపాజిట్లు సేకరించారు.
Read Also:Baramulla Encounter: బారాముల్లాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా 2 లక్షల మంది పోంజీ స్కీమ్కు ఆకర్షితులయ్యారు. వారు కంపెనీ పేరుతో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంత పెద్ద స్టార్ గోవిందాకు సంబంధం ఉన్న కంపెనీలో స్కామ్ ఎలా జరుగుతుందని అనుకున్నారు జనాలు. దీంతో అతను కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఈ ప్రజల సొమ్ము అంతా పోయింది. తన వీడియోలో ఈ కంపెనీని ప్రమోట్ చేసినందుకు గోవింద పేరు ఇంత పెద్ద స్కామ్ లోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందా అనుమానితుడు మాత్రమేనని.. నిందితుడు కాదని, విచారణ తర్వాతే ఈ కంపెనీలో గోవింద ఎలాంటి పాత్ర పోషించాడో తెలుస్తుందని ఈఓడబ్ల్యూ అధికారులు చెబుతున్నారు. గోవింద కాంట్రాక్టు కేవలం కంపెనీని ప్రమోట్ చేయడానికేనా.. లేక మరేదైనా ఇందులో ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టోకెన్గా మాత్రమే వీడియోలో కంపెనీని గోవింద ప్రమోట్ చేసి ఉంటే అతను ప్రభుత్వ సాక్షిగా ఉండేవాడు. ప్రస్తుతం, గోవింద కూడా ఈ విచారణ పరిధిలో ఉన్నారు. త్వరలో ఈవోడబ్ల్యూ బృందం అతనిని విచారించడానికి ముంబైకి వెళ్లనుంది.
Read Also:Shruti Hasan : బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శృతి హాసన్.. కిల్లింగ్ పోజులతో మతిపోగొట్టిందిగా..
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!