West Bengal Violence: బెంగాల్లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Election Violence: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో హింసాకాండ మొదలైంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌరా, బీర్భూమ్ జిల్లాల నుంచి ఈ మరణాలు నమోదయ్యాయి. హౌరా జిల్లా ఉదయ్నారాయణ్పూర్లోని దేబీపూర్ గ్రామంలో సోమవారం రాత్రి బీజేపీ కార్యకర్త జాదవ్ బార్ (45) దారుణ హత్యకు గురయ్యారు. విజయోత్సవ వేడుక నుంచి తిరిగి వస్తుండగా టీఎంసీ కార్యకర్తలు ఆయనపై దాడి చేసి కొట్టి చంపారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రధాన నిందితుడు కలిపద బాగ్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే, ఇది వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా లేదా రాజకీయ కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే సమీర్ పంజాపై జరిగిన దాడికి సంబంధించిన పేర్లను చెప్పమని జాదవ్ను హింసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఖండించిన ఎమ్మెల్యే పంజా.. బీజేపీ మద్దతుదారులే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి ఇళ్లను ధ్వంసం చేశారని ఎదురుదాడికి దిగారు.
ఇక బీర్భూమ్ జిల్లా నాన్నూర్ పరిధిలోని సంతోష్పూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్ (45) దారుణ హత్యకు గురయ్యారు. బంధువుతో కలిసి ఇంటికి వస్తుండగా బీజేపీ మద్దతుదారులు మారణాయుధాలతో దాడి చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో అబీర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన బంధువు అలీ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ హత్యతో తమకు సంబంధం లేదని, ఇది టీఎంసీలోని వర్గ పోరు వల్ల జరిగి ఉంటుందని బీజేపీ కొట్టిపారేసింది. ఉత్తర బెంగాల్లోని జల్పాయ్గురిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీ అభ్యర్థి కృష్ణదాస్ తన అనుచరులతో కలిసి బీజేపీ మద్దతుదారులపై కత్తులతో దాడి చేయడమే కాకుండా కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. భ్రమరీ దేవి ఆలయానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి బుల్లెట్ సైతం తగిలింది. కృష్ణదాస్ కత్తితో బీజేపీ కార్యకర్తలను వెంటాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కృష్ణదాస్ పరారీలో ఉండగా, తాను ఆత్మరక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు.
Also Read
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!