Mamata Banerjee: “ఇక మనం జాగ్రత్తగా ఉండాలి”.. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఎంతో ఉత్కంఠగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ఎట్టకేలకు ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి మే 4న వెలువడబోయే ఫలితాలపైనే ఉంది. ఇక ఈ ఏడాది పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు విజయం తమదేనని ప్రకటించుకుంటున్నాయి. పలు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా సైతం వేశాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వీడియో సందేశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. తన గెలుపుపై అపారమైన ధీమా వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సరళిపై ఆమె నిప్పులు చెరిగారు. ఇక కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభంజనం సృష్టించబోతోందని, తాము ఏకంగా 226 కంటే ఎక్కువ సీట్లు సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమతా ధీమా వ్యక్తం చేశారు. విపరీతమైన ఎండలను, ప్రత్యర్థుల అరాచకాలను ఎదిరించి ఓటు వేసిన బెంగాల్ ప్రజలకు ఆమె “ప్రణామం, సలాం” తెలియజేస్తూ కృతజ్ఞతలు కురిపించారు. ముఖ్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన తన పార్టీ కార్యకర్తలను ‘వీరులు’గా అభివర్ణించారు.
కేంద్రంలోని అధికార పార్టీపై మమతా బెనర్జీ విమర్శల దాడిని ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల నేతలు కలిసి బెంగాల్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి, వారిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రయోగించారని ఆరోపించారు. అయితే బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా వీటన్నింటికీ తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంశంపై స్పందిస్తూ.. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇది ఒక కుట్ర అని మండిపడ్డారు. 2016, 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి అంచనాలే వచ్చాయని, కానీ తుది ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు.
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
కౌంటింగ్ రోజున అత్యంత అప్రమత్తంగా ఉండాలని తన అభ్యర్థులకు, ఏజెంట్లకు మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈవీఎంల (EVM) విషయంలో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాల్కు మిషన్లను తరలించే క్రమంలో మార్పులు జరిగే అవకాశం ఉందని, అందుకే కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అవసరమైతే తానే స్వయంగా మైదానంలోకి దిగి పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉంటూ ప్రజాస్వామ్య విజయాన్ని ఆస్వాదించాలని సూచించారు. బెంగాల్ గడ్డపై ‘మా, మాటి, మానుష్’ (తల్లి, నేల, ప్రజలు) సిద్ధాంతమే మళ్లీ గెలుస్తుందని, ప్రజలు ఇప్పటికే అరాచకానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేశారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
আমরা মা-মাটি-মানুষের সরকার গঠন করছি।
জয় বাংলা! pic.twitter.com/igVP0FlM9G
— Mamata Banerjee (@MamataOfficial) April 30, 2026
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!