Water Overflowing From a Borewell : కరువు సీమలో అద్భుతం.. బోరు నుంచి ఉప్పొంగుతున్న నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Water Overflowing From a Borewell: కరువు సీమలో ఎన్నడు కానరాని అద్భుత దృశ్యం ఆవిషృతమైంది. కొంతకాలంగా ఎండి పోయిన బోరు నుంచి ఎలాంటి మోటరు లేకుండా నీరు ఉబికి వస్తోంది. వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా ఓడిసీ మండలం గాజుకుంటపల్లిలో బోరు బావి నుంచి నీరు బయటకు వస్తోంది. బోరు నుంచి ధారాళంగా నీరు బయటకు వస్తుండడంతో స్థానికులు ఆశ్యర్యపడుతున్నారు. నీరు రాకుండా బోరుపై బండరాయి పెట్టినా.. దానిని తన్నుకుంటూ నీరు ఉబికి వస్తోంది. బోరు నుంచి బయటకు ఉబికి వస్తున్న నీటిని చూసి దాని యజమాని షాన్వాజ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.గత రెండు నెలలుగా రాయలసీమలో భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు ఓ రకమైన బీభత్సమే సృష్టించాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.
Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
వరుణుడి మహోగ్రరూపానికి చిత్రావతి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. పలు చోట్లు కాల్వలకు, చెరువులకు గండ్లుపడ్డాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏకంగా 140 ఏళ్ల క్రితం ఈ రేంజ్ లో వానలు పడ్డాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అప్పటి రికార్డులను చెరిపేస్తూ వాన బీభత్సం సృష్టించింది. సుమారు నలభై టీఎంసీలకు పైగా నీరు భూమిలో ఇంకినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా సస్యశ్యామలం నెలకొందని అన్నారు. అటు సత్యసాయి జిల్లాను వరదలు ముంచెత్తాయి. పదేళ్లుగా లేనంత వానలు పడ్డాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిత్రావతి నదికి వరద పోటెత్తడంతో.. బుక్కపట్నం చెరువు సముద్రాన్ని తలపించింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ధర్మవరం చెరువు ఉధృతంగా ప్రవహించింది. ఈ భారీ వర్షాలకు భూగర్భ జలాలు అసాధారణంగా పెరిగాయని.. అందుకే బోరుబావుల నుంచి నీరు ఉబుకుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!