NTV Telugu Site icon

DK Aruna : ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి శ్రేణిలో భాగమే

Dk Aruna

Dk Aruna

DK Aruna : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నేడు వరంగల్ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి భూపతి శ్రీనివాస వర్మ, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ స్టేషన్లను ప్రారంభించడం గర్వకారణమ్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి శ్రేణిలో భాగమే అని ఆమె తెలిపారు.

Peddi : ‘పెద్ది’ కోసం మున్నా భాయ్.. కొత్త షెడ్యూల్ షూట్ ఎక్కడంటే?

రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో పునఃనిర్మాణం చేసి, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి వరంగల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ఇదంతా మోడీ నిష్పక్షపాత పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, రైల్వే రంగాల్లో కేంద్రం నిధులు కేటాయిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని, ఇది మతపరమైన లేదా ప్రాంతీయ వివక్ష లేకుండా దేశంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆమె అన్నారు.

S Jaishankar: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మతోన్మాది.. ఘర్షణకు కారణం ఆయనే..